Video: ఏంటి బ్రో ఆ బీపీ! పంత్పై కోపంతో లైవ్ షోలో ఏకంగా టీవీనే పగలగొట్టిన యాంకర్
IPL 2025లో రిషబ్ పంత్ బ్యాటింగ్లో స్థిరత్వం లేకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక క్రికెట్ జర్నలిస్టు లైవ్ షోలో తన కోపాన్ని నియంత్రించుకోలేక టీవీని విరగ్గొట్టాడు. అతని భావోద్వేగ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ ప్రేమ గొప్పదే అయినా, ఇంతకుమించి భావోద్వేగానికి లోనవ్వడం సమంజసం కాదనే చర్చ మొదలైంది.

భారతదేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశం మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించే ఈ ఆటపై అభిమానులు ఎక్కువగా భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. క్రికెట్ ప్రేమికులు తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటే, ఓడిపోయినప్పుడు తీవ్ర నిరాశకు గురవుతారు. ఈ ఉద్వేగాల ప్రభావం కేవలం అభిమానులకే కాదు, మీడియా వర్గాల్లో కూడా కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇది మరోసారి నిరూపించింది. IPL 2025లో రిషబ్ పంత్ తన ఆటతీరు ద్వారా అభిమానులను నిరాశపరిచాడు. LSG కెప్టెన్గా ఉన్న పంత్ తన బ్యాటింగ్లో స్థిరత్వాన్ని కనబరచలేకపోతుండటం అభిమానులకు అసహనానికి కారణమైంది. ముఖ్యంగా SRH, LSG మధ్య జరిగిన మ్యాచ్లో అతని ప్రదర్శన అంచనాలను మించలేదు. తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అతను, SRHతో జరిగిన మరో మ్యాచ్లో కేవలం 15 పరుగులకే రన్ అవుట్ అయ్యాడు. ఇది LSG అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్లో జరిగిన ఓ చర్చలో, పంత్ ఆటతీరు పట్ల అసహనం వ్యక్తమైంది. విక్రాంత్ గుప్తా తోపాటు ఇతర క్రికెట్ విశ్లేషకులు పాల్గొన్న ఈ చర్చ గొప్ప వాదనల కంటే భావోద్వేగాలను ఎక్కువగా ప్రదర్శించింది. పంత్ బ్యాటింగ్ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఓ జర్నలిస్ట్, లైవ్ షోలో ఆగ్రహంతో టీవీపై ఒక వస్తువును విసిరి పగలగొట్టాడు. అంతే కాదు, టేబుల్ను నెట్టివేసి, చుట్టూ ఉన్న వస్తువులను కూడా తోసేసాడు.
ఆ జర్నలిస్టు తన కోపాన్ని పూర్తిగా బయటపెట్టాడు. “రిషబ్ పంత్ ఇప్పుడు పూర్తిగా ఊహించగలిగే ఆటగాడిగా మారిపోయాడు. అతనిపై ఎటువంటి నమ్మకం పెట్టుకోలేం” అంటూ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు విక్రాంత్ గుప్తా అతన్ని సముదాయించే ప్రయత్నం చేసినా, ఆ జర్నలిస్టు ఎవరినీ వినడానికి సిద్ధంగా లేడు. తన కోపాన్ని నియంత్రించుకోలేక, మరింత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి పంత్ను దూషించాడు.
అయితే, LSG SRHపై విజయం సాధించినప్పటికీ, పంత్ ప్రదర్శనపై విమర్శలు మాత్రం తగ్గలేదు. జర్నలిస్టు ‘LSG ఈ గెలుపును పంత్ సహాయంతో సాధించిందని చెప్పలేం. అతని ఆటతీరును బట్టి చూస్తే, ఈ జట్టుకు మేలే జరగదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆశ్చర్యకరంగా, ఈ వ్యాఖ్యలకు చాలా మంది అభిమానులు మద్దతు కూడా పలికారు, మరికొంత మంది మాత్రం ఇది ఒక క్రీడ మాత్రమే, ఇంత భావోద్వేగంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
లైవ్ షోలో టీవీని పగలగొట్టిన ఈ సంఘటన కొంతమంది అభిమానులను పాకిస్తాన్ అభిమానులు తమ జట్టు ఓడినప్పుడు టీవీలను పగలగొట్టే దృశ్యాలను గుర్తు చేసిందని వ్యాఖ్యానించారు. క్రికెట్ను ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇంతగా భావోద్వేగంగా మారడం ఎంతవరకు సమంజసం? అనే చర్చ మొదలైంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 27, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..