AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana : డిసెంబర్ 7న స్మృతి-పలాష్ వివాహం? వైరల్ అవుతున్న పెళ్లి డేట్ నిజమేనా ?

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం గురించి నెలకొన్న గందరగోళం ఇంకా వీడలేదు. గతంలో నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం వాయిదా పడింది. అయితే ఇప్పుడు వీరి పెళ్లి డిసెంబర్ 7న జరగబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Smriti Mandhana : డిసెంబర్ 7న స్మృతి-పలాష్ వివాహం? వైరల్ అవుతున్న పెళ్లి డేట్ నిజమేనా ?
Smriti Mandhana
Rakesh
|

Updated on: Dec 02, 2025 | 8:04 PM

Share

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం గురించి నెలకొన్న గందరగోళం ఇంకా వీడలేదు. గతంలో నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం వాయిదా పడింది. అయితే ఇప్పుడు వీరి పెళ్లి డిసెంబర్ 7న జరగబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఊహాగానాల మధ్య పెళ్లి తేదీ గురించి వస్తున్న వార్తల్లో ఎంత నిజనిజాలను స్మృతి మంధాన సోదరుడు అందించారు.

నవంబర్ 23న జరగాల్సిన స్మృతి-పలాష్ వివాహం వాయిదా పడిన తరువాత, సోషల్ మీడియాలో కొత్త తేదీ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు వీరి వివాహం డిసెంబర్ 7న జరగబోతోందని, ఈ వేడుకకు కేవలం కొంతమంది సన్నిహిత స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరవుతారని పేర్కొంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

ఈ వార్త వైరల్ అవ్వడంతో అభిమానులు స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పలాష్‌ను విమర్శించిన వారు సిగ్గుపడతారంటూ కొందరు పోస్ట్‌లు చేశారు. పెళ్లి వాయిదా పడిన తర్వాత పలాష్ ముచ్చల్ మొదటిసారిగా ఎయిర్‌పోర్టులో కనిపించడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది.

డిసెంబర్ 7 వివాహం వార్తలపై స్పందించిన స్మృతి మంధాన సోదరుడు, ఈ పుకార్లకు చెక్ పెట్టారు. స్మృతి సోదరుడు శ్రవణ్ మంధాన, మీడియాతో మాట్లాడుతూ.. “నాకు ఈ పుకార్ల గురించి తెలియదు. నాకు తెలిసినంతవరకు పెళ్లి ఇంకా వాయిదాలోనే ఉంది” అని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ద్వారా డిసెంబర్ 7న వివాహం జరగబోతోందనే వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది. కుటుంబం నుంచి కొత్త తేదీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

నవంబర్ 23న జరగాల్సిన వివాహం, ఆ రోజున అనుకోని ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదా పడింది. వివాహానికి ముందు హల్దీ, సంగీత్ వంటి వేడుకలను కుటుంబాలు, స్నేహితులు ఆనందంగా జరుపుకున్నారు. అయితే పెళ్లి రోజున స్మృతి తండ్రికి అనారోగ్యం తీవ్రం కావడంతో, వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో రెండు కుటుంబాలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాయి.

అయితే సోషల్ మీడియాలో పలాష్ ముచ్చల్ ఎవరినో మోసం చేస్తున్నట్లు కొన్ని మెసేజ్‌ల స్క్రీన్ షాట్‌లు వైరల్ అయ్యాయి. అందుకే పెళ్లి ఆగిపోయిందని కొందరు ఆరోపించారు. కానీ ఈ వార్తలు అధికారికంగా ధృవీకరణ కాలేదు. రెండు కుటుంబాలు మాత్రం ఆరోగ్య కారణాలనే ప్రధానంగా ప్రస్తావించాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us