Video: ఐపీఎల్ 2026లో ఫిక్సింగ్ కలకలం.. లక్నో డగౌట్లో మొబైల్ వాడకంపై దుమారం..!
IPL 2026 Controversy: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్లో మరో భారీ వివాదం తెరపైకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై మరియు లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో, లక్నో డగౌట్లో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాకు చిక్కారు. నిషేధిత ప్రాంతంలో ఫోన్ వాడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు బీసీసీఐ నిబంధనలను ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

IPL 2026 Controversy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత మ్యాచ్ ఉత్కంఠగా ప్రారంభమైంది. తొలి ఓవర్లో మిచెల్ మార్ష్ కొట్టిన బౌండరీని టీవీలో టెలికాస్ట్ చేస్తున్న సమయంలో, లక్నో సూపర్ జెయింట్స్ డగౌట్లో ఉన్న ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో కమ్యూనికేషన్ పరికరాలను వాడటం పూర్తిగా నిషేధం. దీంతో ఈ దృశ్యాలు చూసిన అభిమానులు అవాక్కయ్యారు.
గతంలోనూ ఇటువంటి ఘటనలే..!
ఈ సీజన్లో ఇలాంటి వివాదం రావడం ఇది మొదటిసారి కాదు. కొన్ని వారాల క్రితం గువహటిలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ కూడా డగౌట్లో ఫోన్ వాడుతూ పట్టుబడ్డారు. ఆ సమయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించి అతనికి లక్ష రూపాయల జరిమానాతో పాటు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై బోర్డు భద్రతా నిబంధనల అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Saw someone in the LSG dugout with a phone. I thought that was not allowed
— TSG (@VantaBeast) May 10, 2026
బీసీసీఐ కఠిన నిబంధనలు ఇవే..
క్రీడాకారులు, మ్యాచ్ అధికారుల ప్రాంతం (PMOA) నియమావళి ప్రకారం, జట్టు నిర్వాహకులు కేవలం డ్రెస్సింగ్ రూమ్ లోపల మాత్రమే ఫోన్లు వాడాలి. డగౌట్ లేదా మైదాన ప్రాంతంలో ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. కేవలం జట్టు విశ్లేషకులు మాత్రమే వారికి కేటాయించిన కంప్యూటర్లను వాడుకోవచ్చు. ఇతరులెవరైనా సమాచార సాధనాలను వాడితే అది అవినీతి నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించబడే అవకాశం ఉంది.
ఫిక్సింగ్ ఆరోపణలు.. అభిమానుల ఆగ్రహం..
@IPL @T20IPL2026 @LucknowIPL @sanjivgoenka @BCCI
Someone is seen using a mobile phone in the LSG dugout. Just saw it during LIVE broadcast.
Is this allowed? I don’t think so. It’s an offence and a punishable one.@ChennaiIPL #iplt20 #cskvslsg
— BHARTIYA (@nippamshah) May 10, 2026
ఈ దృశ్యాలు బయటకు వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. “డగౌట్లో ఫోన్లు అనుమతించరు కదా, మరి ఇదెలా సాధ్యం?” అని ఒక వినియోగదారుడు ప్రశ్నించాడు. మరికొందరు ఇది మ్యాచ్ ఫిక్సింగ్కు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆట పారదర్శకతను కాపాడటంలో బీసీసీఐ విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి.
భద్రతపై బోర్డు ముందస్తు హెచ్చరికలు..
ప్రస్తుత సీజన్ ఆరంభంలోనే ఆటగాళ్లకు, అధికారులకు హనీ-ట్రాపింగ్ వంటి ముప్పులు ఉండవచ్చని బీసీసీఐ హెచ్చరించింది. అపరిచిత వ్యక్తులతో కమ్యూనికేషన్ జరపకూడదని, భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించింది. తాజాగా లక్నో డగౌట్లో కనిపించిన వ్యక్తి జట్టు సహాయక సిబ్బందా లేక మరెవరైనా అనే విషయంపై బోర్డు విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ ఘటనపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
