AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: మైదానంలో గురు శిష్యుల సరదా ముచ్చట్లు.. ధోని, కోహ్లీలను చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌.. వైరల్‌ వీడియో

మహేంద్ర సింగ్‌ ధోని- విరాట్ కోహ్లీల ఫ్రెండ్‌షిప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ధోని అండగా నిలిచాడని కోహ్లీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరిని గురుశిష్యులు అని ముద్దుగా పిల్చుకుంటారు క్రికెట్‌ ఫ్యాన్స్‌. తాజాగా ధోని- కోహ్లీల స్నేహబంధానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ వేదికగా నిలిచింది

IPL 2023: మైదానంలో గురు శిష్యుల సరదా ముచ్చట్లు.. ధోని, కోహ్లీలను చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌.. వైరల్‌ వీడియో
Virat Kohli, Ms Dhoni
Basha Shek
|

Updated on: Apr 18, 2023 | 8:01 AM

Share

మహేంద్ర సింగ్‌ ధోని- విరాట్ కోహ్లీల ఫ్రెండ్‌షిప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ధోని అండగా నిలిచాడని కోహ్లీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరిని గురుశిష్యులు అని ముద్దుగా పిల్చుకుంటారు క్రికెట్‌ ఫ్యాన్స్‌. తాజాగా ధోని- కోహ్లీల స్నేహబంధానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లీ స్వయంగా వెళ్లి ధోనిని హత్తుకుని మాటలు కలిపాడు. ఆతర్వాత ఇద్దరూ కలిసి ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ధోని ఏం చెప్పాడో తెలియదు కానీ విరాట్‌ ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ధోని- కోహ్లీ ముచ్చట్లకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలైంది. అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సీజన్‌లో బెంగళూరు, చెన్నై ఒకసారి మాత్రమే తలపడనున్నాయి. దీనికి తోడు ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ధోని– విరాట్‌ కలిసి ఆడిన ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఇదేనేమోనని సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. ఈ క్రమంలో #MAHIRAT అనే హ్యాష్‌ ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే..బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్‌ దుబే(52) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి ఆఖరి ఓవర్‌లో19 పరుగులు అవసరం కాగా..10 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 8 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. బెంగళూరు బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌(62), మాక్స్‌వెల్‌(76) అద్భుతంగ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఇలా తెలుసుకోండి..
తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఇలా తెలుసుకోండి..