IPL 2022 Auction: ‘ఐపీఎల్ వేలం ఓ డ్రామా.. అది అవసరం లేదు.. మూడేళ్ల తరువాత కీలక ప్లేయర్లను కోల్పోవడం సరికాదు’

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 కోసం మెగా వేలం జరగబోతోంది. అయితే దీనికి ముందు, ప్రస్తుత ఐపీఎల్ వ్యవస్థపై తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి.

IPL 2022 Auction: 'ఐపీఎల్ వేలం ఓ డ్రామా.. అది అవసరం లేదు.. మూడేళ్ల తరువాత కీలక ప్లేయర్లను కోల్పోవడం సరికాదు'
Ipl 2022 Retention Live Streaming
Follow us

|

Updated on: Dec 02, 2021 | 7:22 PM

IPL 2022 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 కోసం మెగా వేలం జరగబోతోంది. అయితే దీనికి ముందు, ప్రస్తుత ఐపీఎల్ వ్యవస్థపై తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి. రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను జట్లు సమర్పించడంతో ఆ లిస్టును బీసీసీఐ ప్రకటిచింది. అయితే ప్రస్తుతం ఆటగాళ్ల మెగా వేలం ఉండకూడదని అంటున్నారు. మెగా వేలాన్ని ముగించేందుకు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని పలువురు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకీ మైసూర్, ఢిల్లీ క్యాపిటల్స్ పార్థ్ జిందాల్ మెగా ఐపీఎల్ వేలం ఇకపై అంత సక్సెస్ కాదని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం వేలం అవసరం లేదని ఇద్దరూ తెలిపారు. మెగా వేలంపాటలు అందరికీ ఒకేలా ఉండవని అన్నారు. “లీగ్‌కు ఒక మలుపు ఉంది. ఇక్కడ మెగా వేలం అవసరమా అని మీరు ప్రశ్నించాలి” అని మైసూర్ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్‌తో చెప్పారు. ఇన్‌కమింగ్ కొత్త ప్లేయర్‌ల కోసం డ్రాఫ్ట్‌లను ఫిక్స్ చేయవచ్చు. లేదా పరస్పర అంగీకారంతో వారిని తీసుకోవచ్చు. అలాగే ఆటగాళ్లను రుణంపై తీసుకోవచ్చు. చాలా కాలం పాటు జట్టును నిర్మించడానికి మాకు అవకాశం దక్కుతుందంటూ వారు తెలిపారు.

ఐపీఎల్ జట్లకు వారి సొంత అకాడమీ, సొంత స్కౌటింగ్ వ్యవస్థ ఉందని, ఇందులో యువ, అన్‌క్యాప్డ్ ప్రతిభావంతులైన ఆటగాళ్లను నిమగ్నం చేసి భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేస్తుందని మైసూర్ వెల్లడించారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆటగాళ్లను వేలానికి పంపే బదులు వారిని అలాగే ఉంచుకుని ఫ్రాంచైజీలకు పెట్టుబడి ప్రయోజనాన్ని ఇవ్వవచ్చు. మెగా వేలంపాటలు అన్ని జట్లను సమాన స్థాయికి తీసుకువచ్చే సమయం ఉంది. అయినప్పటికీ, నిర్దిష్ట ఆటగాళ్లను తిరిగి ఎంపిక చేసుకునే హక్కును జట్లకు ఇస్తున్నట్లయితే, అది రిటెన్షన్ ద్వారా కాకుండా రైట్-టు-మ్యాచ్ (RTM) కార్డు ద్వారా ఉండాలని మాకు అనిపించిందని పేర్కొన్నారు.

మూడేళ్ల తర్వాత ఆటగాళ్లను కోల్పోవడం సరికాదని, ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో ఆటగాళ్ల రిటైన్‌లపై జిందాల్ చర్చిస్తూ, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, కగిసో రబాడ, అశ్విన్‌లను కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఐపీఎల్‌లోని రిటైన్ పాలసీ వల్ల ఈ ఆటగాళ్లను మనం నిలబెట్టుకోలేకపోయాం. ముందుకు వెళుతున్నప్పుడు, IPL దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జట్టును నిర్మించడం, యువకులకు అవకాశాలను ఇవ్వడం, ఓ సెటప్ ద్వారా వారిని తీర్చిదిద్దడం సరికాదు. వారు అవకాశాలను పొందుతారు. వారు ఫ్రాంచైజీ కోసం ఆడతారు. ఆపై వారు వెళ్లి కౌంటీ లేదా వారి సంబంధిత దేశాల కోసం ఆడతారు. కానీ, మూడు సంవత్సరాల తర్వాత వారిని కోల్పోవడం చాలా బాధాకరం అని వారి అభిప్రాయాలను తెలిపారు.

నాలుగు జట్లు చెరో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది.

Also Read: Paris Olympics 2024: మిషన్ ఒలింపిక్స్‌లో ఏడుగురు మాజీ అథ్లెట్లు.. పారిస్ 2024 లక్ష్యంగా సన్నాహాలు: అనురాగ్ ఠాకూర్

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

IND vs NZ: 6 సంవత్సరాల నిరీక్షణ.. చరిత్ర సృష్టించిన ఆటగాడికి టీమిండియాలో అవకాశం.. ముంబై టెస్టులో అరంగేట్రం?

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.