AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Dravid: తనయుడి ఆటను చూసేందుకు.. భార్యతో కలిసి సింపుల్‌గా స్టేడియానికి వెళ్లిన రాహుల్ ద్రవిడ్

Cooch Behar Trophy: మైసూర్‌లోని శ్రీకంఠదుట్ట నరసింహరాజ వడయార్ స్టేడియంలో శుక్రవారం కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్‌ని వీక్షించేందుకు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజయతో కలిసి మైదానానికి చేరుకున్నారు. కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తమ కుమారుడు సమిత్ ఆటను ఆసక్తిగా వీక్షించారు.

Rahul Dravid: తనయుడి ఆటను చూసేందుకు.. భార్యతో కలిసి సింపుల్‌గా స్టేడియానికి వెళ్లిన రాహుల్ ద్రవిడ్
Rahul Dravid
Venkata Chari
|

Updated on: Dec 02, 2023 | 12:41 PM

Share

Rahul Dravid Son Samit: రెండోసారి టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉంటున్నాడు. భారత యువ జట్టు ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్‌లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. కాబట్టి, రాహుల్ ద్రవిడ్ (India vs Australia) ప్రపంచ కప్ (ICC World Cup 2023) ఫైనల్ తర్వాత జట్టు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్న ది వాల్ తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. అలాగే, తన కొడుకు ఆటను చూసేందుకు భార్యతో కలిసి మైసూర్ వెళ్లాడు.

మైసూరులో ద్రవిడ్ దంపతులు..

మైసూర్‌లోని శ్రీకంఠదుట్ట నరసింహరాజ వడయార్ స్టేడియంలో శుక్రవారం కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్‌ని వీక్షించేందుకు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజయతో కలిసి మైదానానికి చేరుకున్నారు. కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తమ కుమారుడు సమిత్ ఆటను ఆసక్తిగా వీక్షించారు.

సమిత్ 150 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్..

సమిత్ గురించి మాట్లాడితే.. 2018లో జరిగిన అండర్-14 టోర్నీలో సమిత్ 150 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2023లో జరిగిన ప్రతిష్టాత్మక వినూ మన్కడ్ ట్రోఫీకి కూడా సమిత్ ఎంపికయ్యాడు. అయితే, టోర్నీలో అతని ప్రదర్శన అనుకున్నంతగా గుర్తుండిపోయేలా లేదు. ఎందుకంటే, అతను ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక అర్ధ సెంచరీతో సహా 122 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ముంబైపై అద్భుత ప్రదర్శన..

కానీ, ముంబైపై 95 బంతుల్లో 87 పరుగులు చేసిన సమిత్ చాలా ప్రశంసలు అందుకున్నాడు. కానీ, అద్భుతమైన ప్రయత్నం ఉన్నప్పటికీ, కర్ణాటక 346 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. 46 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. జట్టుకు చిరస్మరణీయ ప్రదర్శన ఇచ్చిన సమిత్ తన ఇన్నింగ్స్‌లో పది బౌండరీలు కొట్టడమే కాకుండా పది ఓవర్లు బౌలింగ్ చేసి 59 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..