AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: మొదటి టెస్టులో 10 ప్రత్యేక రికార్డులు.. లిస్టులో ఏమున్నాయో తెలుసా?

India vs West Indies Records: ప్రవీణ్ ఆమ్రే తొలిసారిగా 1992లో ఈ ఘనత సాధించాడు. ఆమ్రే తర్వాత, ఆర్పీ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్‌లకు అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

IND vs WI: మొదటి టెస్టులో 10 ప్రత్యేక రికార్డులు.. లిస్టులో ఏమున్నాయో తెలుసా?
Ind Vs Wi 1st Test
Venkata Chari
|

Updated on: Jul 15, 2023 | 7:51 PM

Share

India vs West Indies: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో టీమిండియా, భారత ఆటగాళ్లు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు.

1. ఆసియా వెలుపల అతిపెద్ద విజయం: ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసియా వెలుపల ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో ఓడించడం గతంలో రికార్డు. ఇప్పుడు టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

2. బెస్ట్ ఓపెనింగ్ భాగస్వామ్యం: ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఆసియా వెలుపల అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా నిలిచారు. గతంలో ఈ రికార్డు చేతన్ చౌహాన్, సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. 1979లో ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు తొలి వికెట్‌కు 213 పరుగులు జోడించారు.

ఇవి కూడా చదవండి

3. విజయవంతమైన ప్రారంభం: విజయవంతమైన జైస్వాల్ టెస్టు అరంగేట్రంలో 171 పరుగులు చేశాడు. విదేశీ అరంగేట్రంలో ఇదే అతిపెద్ద ఓపెనింగ్ ఇన్నింగ్స్. భారత్ తరపున అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

4. అత్యధిక బంతులు ఆడిన రికార్డు: టెస్టు అరంగేట్రంలో భారత్ తరపున అత్యధిక బంతులు ఆడిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మొత్తం 387 బంతులు ఎదుర్కొన్నాడు. దీంతో మహ్మద్ అజారుద్దీన్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో అజహర్ మొత్తం 322 బంతులు ఎదుర్కొన్నాడు.

5. వెస్టిండీస్ పేలవ ప్రదర్శన: వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండు ఇన్నింగ్స్‌ల మొత్తం స్కోరు 280 పరుగులు మాత్రమే. భారత్‌పై స్వదేశంలో వెస్టిండీస్ సాధించిన అత్యల్ప స్కోరు ఇదే. అంతకుముందు 2016లో, వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 322 పరుగులు చేసింది, ఇది చెత్త రికార్డు.

6. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు: అరంగేట్రంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఎనిమిదో భారతీయుడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ప్రవీణ్ ఆమ్రే తొలిసారిగా 1992లో ఈ ఘనత సాధించాడు. ఆమ్రే తర్వాత ఆర్పీ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్‌లకు అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

7. రెండోస్థానంలో అశ్విన్: ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి, టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ 709 అంతర్జాతీయ వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, అనిల్ కుంబ్లే 956 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

8. అశ్విన్-కుంబ్లే టై: మ్యాచ్‌లో అశ్విన్ మొత్తం 12 వికెట్లు తీశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇది ఎనిమిదోసారి. ఈ విషయంలో అశ్విన్ అనిల్ కుంబ్లే (8 సార్లు) రికార్డును సమం చేశాడు.

9. విరాట్ కోహ్లీ ఆధిక్యం: ఈ మ్యాచ్‌లో 76 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వివియన్ రిచర్డ్స్‌ను అధిగమించాడు. వెస్టిండీస్‌కు చెందిన వివియన్ రిచర్డ్స్ 121 మ్యాచ్‌ల్లో 8540 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 110 టెస్టుల్లో 8555 పరుగులు చేశాడు.

10. రోహిత్ శర్మ సెంచరీ: ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ (103) సెంచరీతో మెరిశాడు. ముఖ్యంగా రోహిత్ శర్మకు ఇది 7వ డబ్ల్యూటీసీ సెంచరీ. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధికంగా 7 సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..