SL vs IND: లంక సిరీస్తో ఆ ఇద్దరి కెరీర్కు ఎండ్ కార్డ్.. లగేజీ ప్యాక్ చేసుకుని ఇంటికెళ్లుడు పక్కా..!
India vs Sri Lanka Test Series: టీమిండియా టెస్టు జట్టులో యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకుంటున్న పరిస్థితుల్లో సీనియర్లకు కూడా తమ స్థానాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. శ్రీలంక టూర్లో మిగిలిన మ్యాచ్ల్లో పంత్, కుల్దీప్ ఇద్దరికీ తమపై ఉన్న అంచనాలకు సమాధానం చెప్పే వేదికగా మారవచ్చు.

India vs Sri Lanka Test Series: శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ టీమిండియాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పరంగా చాలా కీలకం. అదే సమయంలో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు ఇది మరో రకమైన పరీక్షగా మారింది. జట్టులో యువ ఆటగాళ్ల నుంచి పోటీ పెరుగుతున్న వేళ.. ఈ సిరీస్లో వారి ప్రదర్శనపై ఇప్పుడు చర్చ మొదలైంది.
పంత్కు పెరుగుతున్న పోటీ..
శ్రీలంకతో టెస్టు సిరీస్లో రిషభ్ పంత్ స్థానం మరోసారి చర్చకు వచ్చింది. భారత టెస్టు జట్టులో చాలాకాలంగా కీలక వికెట్కీపర్గా కొనసాగుతున్న పంత్.. తన దూకుడైన బ్యాటింగ్తో ఎన్నో సందర్భాల్లో మ్యాచ్ గమనాన్నే మార్చిన విషయం తెలిసిందే. అయితే గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్లో మంచి ఆరంభం లభించినా దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. 39 పరుగుల వద్ద పంత్ పెవిలియన్కు చేరారు. పంత్ ఆడిన షాట్పై విమర్శలు కూడా వచ్చాయి.
పంత్కు ఇప్పుడు ఉన్న అసలు సవాలు ధ్రువ్ జురెల్ రూపంలో కనిపిస్తోంది. పరిమిత అవకాశాల్లోనే జురెల్ తన బ్యాటింగ్ పద్ధతి, సహనం, వికెట్కీపింగ్తో ఆకట్టుకున్నాడు. గాలే టెస్టులోనూ అతడు 51 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో జట్టు యాజమాన్యం దృష్టిలో అతని స్థానం మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. పంత్ వరుసగా వచ్చిన అవకాశాలను పెద్ద ఇన్నింగ్స్లుగా మార్చలేకపోతే.. జురెల్ను క్రమం తప్పకుండా వికెట్కీపర్ కం బ్యాటర్గా పరీక్షించే పరిస్థితి రావొచ్చు.
కుల్దీప్కు స్పిన్కు కఠిన పరీక్ష..
మరోవైపు కుల్దీప్ యాదవ్ పరిస్థితి కూడా అంత సులభంగా ఏంలేదు. శ్రీలంక పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయని భావించిన నేపథ్యంలో అతడిపై అంచనాలు భారీగా ఉన్నాయి. గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ 65 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అదే ఇన్నింగ్స్లో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఇక్కడే కుల్దీప్పై ఒత్తిడి పెరుగుతోంది. టెస్టు క్రికెట్లో అతనికి ఎక్కువ కాలం నిరంతర అవకాశాలు దక్కలేదు. ఇప్పుడు స్పిన్కు అనుకూలమైన పరిస్థితుల్లో ఆడే అవకాశం వచ్చినప్పుడు ప్రభావం చూపాల్సిన అవసరం ఏర్పడింది. వికెట్లు తీయడంలో విఫలమైతే మున్నుందు ఛాన్స్లు రాకపోవచ్చు. మానవ్ సుతార్తో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉన్నారు.
రెండో టెస్టు ఇద్దరికీ కీలకం..
శ్రీలంకతో రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. ఈ మ్యాచ్లో పంత్ బ్యాట్తో తన స్థాయిని చూపించాల్సిన అవసరం ఉంది. మంచి ఆరంభాన్ని పెద్ద స్కోరుగా మలచడం ఎంతో అవసరం. అదే సమయంలో కుల్దీప్ తన స్పిన్ వైవిధ్యాన్ని ఉపయోగించి కీలక వికెట్లు సాధించాల్సి ఉంటుంది.
ఒక్క మ్యాచ్ లేదా ఒక్క సిరీస్ ఆధారంగా ఆటగాడి టెస్టు కెరీర్పై తుది నిర్ణయం తీసుకోవడం తొందరపాటే. అయినా జట్టులో చోటు కోసం పోటీ పెరిగినప్పుడు ప్రతి అవకాశం విలువైనదిగా మారుతుంది. పంత్కు జురెల్ నుంచి, కుల్దీప్కు సుతార్ సహా ఇతర స్పిన్నర్ల నుంచి పోటీ ఉండటం ఈ సిరీస్ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




