AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 12 మ్యాచ్‌లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లాన్ ఉంది భయ్యో..!

India tour of New Zealand 2026: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును గట్టెక్కించేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టపోయిన కివీస్ బోర్డు, అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనున్న టీమ్ ఇండియా 12 మ్యాచ్‌ల పర్యటన ద్వారా దాదాపు రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఆశిస్తోంది.

Team India: 12 మ్యాచ్‌లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లాన్ ఉంది భయ్యో..!
Nz Vs Ind Tour
Venkata Chari
|

Updated on: Aug 20, 2026 | 7:11 PM

Share

India tour of New Zealand 2026: మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.8 మిలియన్ డాలర్ల లోటు ఉంటుందని అంచనా వేయగా, అది కాస్తా ఏకంగా 7.3 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.70 కోట్లు) చేరింది. భారత్‌లో గేమింగ్ నిబంధనల సవరణ ప్రభావంతో స్పాన్సర్ డ్రీమ్ 11 భాగస్వామ్యంలో వచ్చిన మార్పులు తమకు భారీ నష్టాన్ని మిగిల్చినట్లు బోర్డు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత పర్యటనే తమకు ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తోంది.

12 మ్యాచ్‌ల మెగా టూర్ షెడ్యూల్..

భారత్ ఈ పర్యటనలో భాగంగా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

టీ20 సిరీస్: అక్టోబర్ 22, 24 తేదీలలో క్రైస్ట్‌చర్చ్, అక్టోబర్ 27న వెల్లింగ్టన్, అక్టోబర్ 30న ఆక్లాండ్, నవంబర్ 1న హామిల్టన్.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..!

వన్డే సిరీస్: నవంబర్ 4న ఆక్లాండ్, నవంబర్ 7న వెల్లింగ్టన్, నవంబర్ 10న హామిల్టన్, నవంబర్ 13, 15 తేదీలలో మౌంట్ మౌంగనుయ్.

టెస్టు సిరీస్: నవంబర్ 19న వెల్లింగ్టన్, నవంబర్ 27న క్రైస్ట్‌చర్చ్.

భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ సవాలు..

ఈ పర్యటన న్యూజిలాండ్‌కు ఆర్థికంగా ఎంత కీలకమో, భారత జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ చేరడానికి అంతకంటే కీలకం. స్వదేశంలో కివీస్ అత్యంత బలమైన జట్టు కావడంతో ఈ రెండు టెస్టుల సిరీస్ టీమ్ ఇండియాకు కఠినమైన పరీక్షగా మారనుంది. ఇందులో ప్రతికూల ఫలితాలు వస్తే భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.

ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..!

భారత పర్యటన ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాలని కివీస్ బోర్డు భావిస్తుండగా, క్లిష్టమైన పిచ్‌లపై సిరీస్‌లు నెగ్గి సత్తా చాటాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది. మైదానంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
12 మ్యాచ్‌లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లానే..!
12 మ్యాచ్‌లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లానే..!
నేను, సీఎం రేవంత్ క్లాస్‌మేట్స్.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్
నేను, సీఎం రేవంత్ క్లాస్‌మేట్స్.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్
లక్షల రెమ్యునరేషన్.. చివరకు అంత్రక్రియలకు డబ్బులేక అనాధలా..
లక్షల రెమ్యునరేషన్.. చివరకు అంత్రక్రియలకు డబ్బులేక అనాధలా..
కేబీఆర్ పార్కు చెట్ల నరికివేత కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కేబీఆర్ పార్కు చెట్ల నరికివేత కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్
హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్
సిరిసంపదల కోసం తాబేలు ఉంగరం ధరిస్తున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం
సిరిసంపదల కోసం తాబేలు ఉంగరం ధరిస్తున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం
పులితో సెల్ఫీ ప్రాణాల మీదకు తెచ్చింది..!
పులితో సెల్ఫీ ప్రాణాల మీదకు తెచ్చింది..!
శుక్రుడి నక్షత్ర మార్పుతో ఆ రాశులకు అదృష్టమే అదృష్టం!
శుక్రుడి నక్షత్ర మార్పుతో ఆ రాశులకు అదృష్టమే అదృష్టం!
11 ఫోర్లు, 11 సిక్సర్లు.. 72 బంతుల్లో రికార్డుల ఊచకోత..!
11 ఫోర్లు, 11 సిక్సర్లు.. 72 బంతుల్లో రికార్డుల ఊచకోత..!
ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ 'డీసీ'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ 'డీసీ'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?