AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4వసారి టీమిండియాను మోసం చేసిన ఆల్ రౌండర్.. గాలే టెస్ట్‌లోనూ హ్యాండిచ్చాడుగా..!

Ravindra Jadeja No Ball: గాలే టెస్టులో రవీంద్ర జడేజా వేసిన అద్భుతమైన బంతికి శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా చిక్కుకున్నాడు. క్యాచ్ కూడా అందుకుంది భారత్. అంతా వికెట్ అనుకున్న వేళ జడేజా చేసిన చిన్న తప్పిదం కారణంగా అసలు కథే మారిపోయింది.

4వసారి టీమిండియాను మోసం చేసిన ఆల్ రౌండర్.. గాలే టెస్ట్‌లోనూ హ్యాండిచ్చాడుగా..!
Ravindra Jadeja No Ball
Venkata Chari
|

Updated on: Aug 18, 2026 | 8:15 PM

Share

Ravindra Jadeja No Ball: భారత్, శ్రీలంక మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా అద్భుతంగా విసిరాడు. బంతి వేగంగా తిరిగి ధనంజయ డి సిల్వా బ్యాట్ అంచును తాకింది. తొలి స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో భారత ఆటగాళ్లు వికెట్ సంబరాల్లో మునిగిపోయారు. ధనంజయకు ఇక క్రీజులో అవకాశం లేదనుకున్న సమయంలో అంపైర్ నో-బాల్ ప్రకటించడంతో అంతా షాకయ్యారు. రీప్లేలో జడేజా పాదం పాపింగ్ క్రీజ్ దాటి ఉన్నట్లు కనిపించింది. దీంతో శ్రీలంక కెప్టెన్‌కు అనుకోని లైఫ్ దక్కింది.

జడేజా బంతికి ధనంజయ దగ్గర సమాధానం లేదు..

ఈ బంతి జడేజా సాధారణంగా వేసే బంతులకు భిన్నంగా ఉంది. వేగంగా తిరిగిన బంతి బ్యాట్ మధ్యభాగాన్ని తప్పించుకుని స్వల్పంగా ఎడ్జ్ తీసుకుంది. ఆ బంతిని ధనంజయ అడ్డుకునే అవకాశం కూడా కనిపించలేదు. కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో భారత శిబిరంలో ఉత్సాహం కనిపించింది.

ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..!

ఇవి కూడా చదవండి

క్యాచ్ పూర్తయిన వెంటనే నో-బాల్ నిర్ణయం రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జడేజా చేసిన ఈ తప్పిదం వల్ల శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా క్రీజులో కొనసాగేందుకు అవకాశం లభించింది.

గాలే టెస్టులో జడేజాకు నాలుగో నో-బాల్..

రీప్లే పరిశీలించిన తర్వాత జడేజా పాదం క్రీజ్ దాటినట్లు స్పష్టమైంది. ఈ మ్యాచ్‌లో అతను వేసిన నాలుగో నో-బాల్ ఇదే కావడం మరో అంశం. టెస్టు క్రికెట్‌లో స్పిన్ బౌలర్ నుంచి వరుసగా నో-బాల్స్ రావడం జట్టుకు ఆందోళన కలిగించే విషయమే.

ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..!

ఇంతకుముందు మూడు నో-బాల్స్ జరిగినా పెద్ద నష్టం కనిపించలేదు. ఈసారి మాత్రం శ్రీలంక కెప్టెన్ కీలక వికెట్ చేతికి వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆ జీవితం ధనంజయ ఇన్నింగ్స్‌పై ఎంత ప్రభావం చూపుతుందనేది మ్యాచ్ ఫలితాన్ని బట్టి మరింత ప్రాధాన్యం సంతరించుకోనుంది.

రవీంద్ర జడేజా వేసిన అద్భుతమైన బంతి టీమిండియాకు కీలక వికెట్ అందించినట్టే కనిపించింది. చివరకు నో-బాల్ కారణంగా ధనంజయ డి సిల్వాకు లైఫ్ రావడంతో గాలే టెస్టులో ఈ ఘటన భారత జట్టుకు చేదు అనుభవంగా మారింది. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక టీం 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. దినుష 25, డి సిల్వ 31 పరుగులతో క్రీజులో నిలిచారు. శ్రీలంక గెలవాలంటే ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. అలాగే భారత జట్టు విజయం సాధించాలంటే మాత్రం మరో 6 వికెట్లు పడగొడితే సరిపోతుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us