AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: రెడ్ క్యాప్స్ ధరించి బరిలోకి భారత్, ఇంగ్లండ్ జట్లు.. ఎందుకో తెలుసా?

India vs England 3rd Test: లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌లో ఆటగాళ్లు రెడ్ క్యాప్‌లు ధరించి బరిలోకి దిగనున్నారు. అందుకు గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్లకు 251 పరుగులు చేసింది.

IND vs ENG: రెడ్ క్యాప్స్ ధరించి బరిలోకి భారత్, ఇంగ్లండ్ జట్లు.. ఎందుకో తెలుసా?
Ind Vs Eng 3rd Test Day 2
Venkata Chari
|

Updated on: Jul 11, 2025 | 1:13 PM

Share

India vs England 3rd Test: టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే, అందరూ తెలుపు రంగు దుస్తుల్లో కనిపిస్తారు. షూస్, షర్టులు, ప్యాంట్లు, సాక్స్ కూడా తెల్లగా ఉండాల్సిందే. అయితే, ఈరోజు లార్డ్స్ (Lord’s Test)లో, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఆటగాళ్ళు రెడ్ క్యాప్స్ ధరించి బరిలోకి దిగనున్నారు. దీనికి ఒక కారణం ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ జరిగే మ్యాచ్ రెండవ రోజున, ఆటగాళ్ళు రెడ్ క్యాప్స్ ధరిస్తారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్ట్రాస్‌కు నివాళి అర్పించడానికి ఈ చొరవ తీసుకున్నారు. రూత్ స్ట్రాస్ 2018 లో అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ఆమె మరణించింది. రూత్ ఒక ఆస్ట్రేలియన్ నటి.

ఇవి కూడా చదవండి

తన భార్య జ్ఞాపకార్థం, ఆండ్రూ స్ట్రాస్ రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై పరిశోధన, వ్యాధి బారిన పడిన వారికి, వారి కుటుంబాలకు మద్దతు ఇస్తుంది. ఈ ఫౌండేషన్‌కు మద్దతుగా ఇంగ్లాండ్ జట్టు మాత్రమే కాకుండా, భారత జట్టు కూడా ఎర్ర టోపీలు ధరిస్తుంది. దీనిని ‘రూత్ డే’ అని కూడా పిలుస్తారు. ఆ రోజున, అన్ని ఆటగాళ్ళు ఎర్ర టోపీలు ధరిస్తారు. ప్రేక్షకులు ఎర్ర టోపీలు ధరించమని ప్రోత్సహిస్తారు. ఈ చొరవ రూత్ స్ట్రాస్‌కు నివాళి అర్పించడానికి మాత్రమే కాదు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయం చేయడానికి కూడా.

ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ సహాయం, సలహాతో ఆండ్రూ స్ట్రాస్ రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌ను స్థాపించారు. గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ కూడా క్యాన్సర్‌తో మరణించారు. దీంతో మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. దాని నుంచి ప్రేరణ పొందిన ఆండ్రూ స్ట్రాస్ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

లార్డ్స్ టెస్ట్ పరిస్థితి..

తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్లకు 251 పరుగులు చేసింది. రూట్ (99), స్టోక్స్ (39) క్రీజులో ఉన్నారు. టీం ఇండియా తరపున నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు, బుమ్రా, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..