AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Cricket: ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?

టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లదే హవా. మొదటి బంతి నుంచే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడతారు. స్టార్ బౌలర్లు సైతం...

T20 Cricket: ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?
Cricket
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 29, 2021 | 6:02 PM

Share

టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లదే హవా. మొదటి బంతి నుంచే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడతారు. స్టార్ బౌలర్లు సైతం ఈ ఫార్మాట్‌లో చేదు అనుభవం ఎదుర్కోవాల్సిందే. ఈ పొట్టి ఫార్మాట్‌లో అప్పుడప్పుడూ ఓవర్‌కు 20-30 పరుగులు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే తాజాగా ఓ టీ20 మ్యాచ్ జరిగింది. అందులో సీన్ కాస్తా రివర్స్ అయింది. టీ20 మ్యాచ్‌లో టెస్ట్ బ్యాటింగ్ చేసింది ఓ జట్టు. మొత్తం ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి కేవలం 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. 15.4 ఓవర్లు అంటే 94 బంతులు బ్యాటింగ్ చేసి 27 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో కువైట్ ఉమెన్స్ వెర్సస్, నేపాల్ ఉమెన్స్ మధ్య జరిగింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆసియా రీజియన్ క్వాలిఫైయర్ల సిరీస్‌లో భాగంగా ఈ రెండు జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కువైట్ జట్టు 15.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 27 పరుగులకు ఆలౌట్ అయింది. కువైట్ బ్యాటర్లలో ఏడుగురు అస్సలు ఖాతానే తెరవలేదు. ఓపెనర్ ప్రియద మురళి(10) అత్యధిక స్కోరర్. నేపాల్ బౌలర్లలో సంగీతా రాయ్ 2.4 ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. రుబీనా చెర్రీ రెండు మెయిడిన్లు వేసి 3 ఓవర్లలో కేవలం 1 పరుగు ఇచ్చి 2 వికెట్లు తీసింది.

21 బంతుల్లో మ్యాచ్ ఖతం…

కువైట్ విధించిన టార్గెట్ చాలా చిన్నది. ఏ జట్టైనా కూడా ఈజీగా చేధించగలదు. అయితే నేపాల్ జట్టు మాత్రం తొలి ఓవర్‌లోనే వికెట్ నష్టపోయింది. కానీ మరో వికెట్ పడకుండా నిలదొక్కుకుని.. లక్ష్యాన్ని 21 బంతుల్లో చేధించింది. తద్వారా కువైట్ జట్టుపై 9 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచింది.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే! 

టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
సుదీర్ఘ న్యాయ పోరాటానికి విషాదకరమైన ముగింపు..!
సుదీర్ఘ న్యాయ పోరాటానికి విషాదకరమైన ముగింపు..!