IND vs NZ 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 345 పరుగులకు ఆలౌట్.. సెంచరీతో శ్రేయాస్, అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న గిల్, జడేజా

India vs New Zealand 1st Test Day 2: టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. సెంచరీతో శ్రేయాస్ అయ్యర్, అర్థసెంచరీలతో గిల్, జడేజాలు ఆకట్టుకున్నారు.

IND vs NZ 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 345 పరుగులకు ఆలౌట్.. సెంచరీతో శ్రేయాస్, అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న గిల్, జడేజా
India Vs New Zealand 1st Test Iyer, Jadeja, Gill
Follow us

|

Updated on: Nov 26, 2021 | 12:35 PM

India vs New Zealand 1st Test: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్లు త్వరగానే వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది. తొలి రోజు భారత్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇదే స్కోర్‌తో రెండో రోజు ఆటను జడేజా, శ్రేయాస్ అయ్యర్‌లు ప్రారంభించారు. అయితే జడేజా(50 పరుగులు, 112 బంతులు, 6 ఫోర్లు) రెండో రోజు పరుగులేమీ చేయకుండానే సౌతీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో జడేజా, శ్రేయాస్ అయ్యర్‌లు ఇద్దరూ కలిసి 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత సాహా(1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక సౌతీకి వికెట్ సమర్పించుకున్నాడు. తన తొలి సెంచరీ చేసి దూకుడు మీదున్న శ్రేయాస్ అయ్యర్(105 పరుగులు, 171 బంతులు, 13 ఫోర్లు, 2 సిక్సులు) కూడా డ్రింక్స్‌ తరువాత తొలి బంతికే సౌతీకి చిక్కాడు. ఆ తరువాత అక్షర్(3) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. ఉమేష్ యాదవ్ 10 నాటౌట్, అశ్విన్ 38, ఇషాంత్ శర్మ 0 పరుగులు చేశారు. దీంతో టీమిండియా మొత్తంగా 390 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 5, కైల్ జైమీసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

తొలి రోజు టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శుభ్‎మన్ గిల్.. మంచి ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. మయాంక్‌ అగర్వాల్‌ 28 బంతుల్లో రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి జేమీసన్‌ బౌలింగ్‌లో కీపర్‌ బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా.. గిల్‎తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 87 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‎తో 52 పరుగులు చేశాడు. దీంతో టీమ్ఇండియా భోజన విరామ సమయానికి 82/1తో నిలిచింది.

భోజన విరామం అనంతరం 52 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌ జెమీసన్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహానె, పుజారాతో కలిసి ఆచితూచి ఆడారు. జట్టు స్కోర్ 106 పరుగుల వద్ద పుజారా సౌథీ బౌలింగ్‎లో వెనుదిరిగాడు. కాసేపటికే 35 పరుగులు చేసిన కెప్టెన్ రహానెను జెమీసన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఇక మూడో సెషన్‎లో శ్రేయాస్ అయ్యర్, రవింద్ర జడేజా కివీస్ బౌలర్లను ఆడుకున్నారు. చెత్తు బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో శ్రేయాస్ తన తొలి టెస్ట్‎లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆట ముగిసే ముందు జడేజా కూడా అర్థ సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‎లతో 75 పరుగులు, జడేజా 100 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేశారు.

Also Read: T20 Cricket: ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?

భారత విజయానికి ఒక వికెట్.. దక్షిణాఫ్రికా గెలిచేందుకు 6 పరుగులు.. చివరి ఓవర్ బౌల్ చేసిన లిటిల్ మాస్టర్.. ఫలితం ఏంటో తెలుసా? (వీడియో)

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు