AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఈరేంజ్‌లో ఆడుతుంటే, ప్రపంచకప్‌లో చోటివ్వరా.. సెంచరీతో వైల్డ్ సెలబ్రేషన్స్‌.. సెలెక్టర్లకు షాకిచ్చిన భారత ఆటగాడు..

Shubman Gill Angry Celebration: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 52 బంతుల్లో 196.15 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ సాధించాడు. 9 బౌండరీలు, 6 సిక్సర్లు బాదాడు. సెంచరీ చేజారడంతో గిల్ మైదానంలోకి దూసుకెళ్లి దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. దీనికి కారణం బీసీసీఐ సెలక్షన్ కమిటీ.

Video: ఈరేంజ్‌లో ఆడుతుంటే, ప్రపంచకప్‌లో చోటివ్వరా.. సెంచరీతో వైల్డ్ సెలబ్రేషన్స్‌.. సెలెక్టర్లకు షాకిచ్చిన భారత ఆటగాడు..
Shubman Gill Angry Celebrat
Venkata Chari
|

Updated on: May 11, 2024 | 11:10 AM

Share

Shubman Gill Angry Celebration: ఐపీఎల్ 17వ సీజన్ 59వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చెన్నై సూపర్ కింగ్స్‌పై తుఫాన్ సెంచరీ సాధించాడు. గిల్ సెంచరీ ఎంతో ప్రత్యేక రికార్డును కలిగి ఉంది. శుభ్‌మన్ సెంచరీ ఐపీఎల్ చరిత్రలో 100వ సెంచరీగా నిలిచింది. గిల్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ కాగా, నరేంద్ర మోదీ స్టేడియంలో మూడో సెంచరీ, కెప్టెన్‌గా తొలి సెంచరీ. సెంచరీ చేసిన తర్వాత శుభ్‌మన్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. గిల్ కోపంగా వేడుక చేసుకోవడానికి కారణం కూడా ఉంది.

శుభ్‌మన్ గిల్ 196.15 స్ట్రైక్ రేట్‌తో 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. శుభ్‌మన్ సెంచరీ చేయడంతో గుజరాత్ డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లందరూ చప్పట్లు కొట్టారు. కోచ్ జాంటీ రోడ్స్ కూడా అతడిని అభినందించాడు. గిల్ మైదానంలోకి దూకి, తన చేతులతో హెల్మెట్‌ను పైకి లేపి వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి కారణం బీసీసీఐ సెలక్షన్ కమిటీ.

ఇవి కూడా చదవండి

2024 ICC T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ఏప్రిల్ 30 న ప్రకటించారు. ప్రపంచకప్ ప్రధాన జట్టు నుంచి శుభ్‌మన్ గిల్‌ను తొలగించారు. గిల్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా చేర్చారు. ఈ కోపాన్ని శుభ్‌మన్ తన వేడుక ద్వారా వ్యక్తం చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పుడు గిల్ దూకుడు వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శుభ్మన్ గిల్ సెంచరీ సెలబ్రేషన్స్..

మ్యాచ్ అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, “నిజాయితీగా చెప్పాలంటే, ఒక దశలో మేం 250+ పరుగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే చివరి దశలో వెనుకబడ్డాం. చివరి రెండు-మూడు ఓవర్లలో చెన్నై బౌలింగ్ బాగుంది. మేం 10-15 తక్కువ ఉన్నాం. అది నెట్ రన్ రేట్‌పై పడుతుందని మాకు తెలుసు. నాకు, సాయి సుదర్శన్‌కు లక్ష్యాలు లేవు, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మేం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం”అంటూ గిల్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..