AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాయుడు రిటైర్మెంట్..సెలక్టర్లపై నిప్పులు చెరిగిన గంభీర్

స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నా కూడా తనని కాదని..మయాంక్ అగర్వాల్‌ను వరల్డ్ కప్ టీంలోకి సెలక్ట్ చేయడంతో అసంత‌ృప్తి గురైన అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రాయుడు రిటైర్మెంట్ ప్రకటనపై.. మాజీ టీమిండియా ఆటగాడు, ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఎలాంటి ఆశ్యర్యాన్ని కలిగించలేదట. ఆత్మాభిమానం గల ఆటగాడు ఎవరైనా ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత ఇలాగే చేస్తాడని గంభీర్ పేర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా సెలెక్షన్ కమిటీ అతడిపట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించిందని ఆరోపించాడు. ”ప్రస్తుతమున్న […]

రాయుడు రిటైర్మెంట్..సెలక్టర్లపై నిప్పులు చెరిగిన గంభీర్
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2019 | 6:32 PM

Share

స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నా కూడా తనని కాదని..మయాంక్ అగర్వాల్‌ను వరల్డ్ కప్ టీంలోకి సెలక్ట్ చేయడంతో అసంత‌ృప్తి గురైన అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రాయుడు రిటైర్మెంట్ ప్రకటనపై.. మాజీ టీమిండియా ఆటగాడు, ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఎలాంటి ఆశ్యర్యాన్ని కలిగించలేదట. ఆత్మాభిమానం గల ఆటగాడు ఎవరైనా ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత ఇలాగే చేస్తాడని గంభీర్ పేర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా సెలెక్షన్ కమిటీ అతడిపట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించిందని ఆరోపించాడు.

”ప్రస్తుతమున్న సెలెక్షన్ కమిటీలోని ఐదుగురు సభ్యుల కంటే అంబటి రాయుడు చాలా మంచి ఆటగాడు. ఆ ఐదుగురు కలిసి తమ కెరీర్ మొత్తంలో సాధించలేనన్ని పరుగులు రాయుడు ఒక్కడే సాధించాడు. అందుకోసమే అతన్ని ప్రపంచ కప్ కు ఎంపిక చేయలేనట్లున్నారు. శిఖర్ ధవన్ ప్రపంచ కప్ కు దూరమైతే స్టాండ్ బై ఆటగాడిగా వున్న రిషబ్ పంత్ కు అవకాశమిచ్చారు. కానీ విజయ్ శంకర్ దూరమైతే మిగిలిన స్టాండ్ బై ఆటగాన్ని రాయుడికి కాదని మయాంక్ కు అవకాశమిచ్చారు. ఇంత అవమానాన్ని ఎదుర్నొన్న రాయుడు స్థానంలో ఎవరున్నా ఇలాంటి నిర్ణయమే తీసకుంటారు.” అని గంభీర్ ఎమ్మెస్కే  ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై తీవ్ర వ్యాక్యలు చేశాడు.

భారత్ తరపునే కాదు ఐపిఎల్ లో కూడా రాయుడు అద్భుతంగా ఆడాడని గంభీర్ ప్రశంసించాడు. అంతర్జాతీయ స్థాయిలో అతడు మూడు సెంచరీలు, పది హాఫ్ సెంచరీలో అదరగొట్టాడని గుర్తుచేశాడు. ఇలాంటి ఆటగాన్ని కోల్పోవడం టీమిండియాకు నిజంగా లోటేనని  అన్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదో బాధాకరమైన  సంఘటన అని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.