AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: మరో కొత్త టీం ఎంట్రీకి రంగం సిద్ధం.. భారీ స్కెచ్‌తో ముందుకొచ్చిన ఐపీఎల్ ఫ్రాంచైజీ..!

Chennai Super Kings Women Cricket: భారత మహిళా క్రికెట్ రంగాన్ని మలుపు తిప్పిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మరింత విస్తరించబోతోంది. ఐపీఎల్‌లో అత్యంత ఆదరణ కలిగిన దిగ్గజ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) ఈ లీగ్‌లోకి అడుగుపెట్టడానికి ఆసక్తి చూపుతోంది. మహిళల లీగ్‌లో సరికొత్త జట్టును కొనుగోలు చేసేందుకు యాజమాన్యం అధికారికంగా సంకేతాలు ఇవ్వడంతో క్రీడా వర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

IPL: మరో కొత్త టీం ఎంట్రీకి రంగం సిద్ధం.. భారీ స్కెచ్‌తో ముందుకొచ్చిన ఐపీఎల్ ఫ్రాంచైజీ..!
Ipl 2026 Csk
Venkata Chari
|

Updated on: May 18, 2026 | 2:48 PM

Share

Chennai Super Kings Women Cricket: పురుషుల ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచి, అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు మహిళల క్రికెట్ వైపు అడుగులు వేస్తోంది. తమిళనాడు గ్లోబల్ టూరిజం సదస్సులో సిఎస్‌కె ప్రధాన కార్యనిర్వాహక అధికారి (CEO) కాశీ విశ్వనాథన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పురుషుల క్రికెట్ తర్వాత ఫ్రాంచైజీ విస్తరణలో భాగంగా తాము మహిళల క్రికెట్‌కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలోనే డబ్ల్యూపీఎల్‌లో ఒక జట్టును సొంతం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన వెల్లడించారు.

డబ్ల్యూపీఎల్ వేదికపై పసుపు జెండా రెపరెపలు..?

ప్రస్తుతం మహిళల లీగ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ప్రముఖ ఐపీఎల్ జట్లు ఇప్పటికే తమ మహిళా జట్లను విజయవంతంగా నడుపుతున్నాయి. వీటికి తోడు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ కూడా లీగ్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చెన్నై సూపర్ కింగ్స్ కూడా చేరితే లీగ్ స్థాయి మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నై జట్టుకు ఉన్న అపారమైన అభిమాన బలం (ఎల్లో ఆర్మీ) మహిళల లీగ్‌కు కూడా తోడైతే, మైదానాలు పసుపు రంగుతో కళకళలాడటం ఖాయం.

ఇది కూడా చదవండి: MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ధోనీ కీలక సంకేతాలు..!

ఇవి కూడా చదవండి

తొందరపాటు లేదు.. వ్యూహాత్మకంగా అడుగులు..

మహిళల లీగ్‌లోకి ప్రవేశించడంపై కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. యాజమాన్యం ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని, అత్యంత సుస్థిరమైన, వ్యూహాత్మకమైన విధానంలోనే ముందుకు వెళ్తామని చెప్పారు. క్రీడారంగంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో ఆటగాళ్లకు అండగా నిలబడటం చెన్నై సంస్కృతి. అదే పద్ధతిని మహిళల క్రికెట్‌లోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. క్రికెట్‌తో పాటు తమిళనాడులో గ్రాస్‌రూట్ స్థాయిలో చెస్, కుస్తీ వంటి ఇతర క్రీడలను కూడా సిఎస్‌కె ప్రోత్సహిస్తోందని, అందులో భాగంగానే మహిళా క్రీడాకారులకు పెద్దపీట వేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.

లీగ్ భవిష్యత్తును మార్చబోతున్న ఎంట్రీ..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళల క్రికెట్‌ను మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఈ తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన యాజమాన్యం లీగ్‌లోకి రావడం వల్ల యువ మహిళా క్రికెటర్లకు మరిన్ని మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులను వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో సిఎస్‌కె మేనేజ్‌మెంట్ అనుభవం ఎంతగానో ఉపయోగపడనుంది.

ఇది కూడా చదవండి: ఇది కదా ట్విస్ట్ అంటే.. SRH గెలిస్తే ప్లేఆఫ్స్‌కు 2 జట్లు.. కాటేరమ్మ కొడుకులతో అట్లుంటది మరి..!

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఐపీఎల్‌లో ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పుడు మహిళల లీగ్‌లోనూ అదే విధమైన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. అధికారికంగా ఈ జట్టు ఎప్పుడు రంగంలోకి దిగుతుందనే దానిపై ఇంకా స్పష్టమైన తేదీ వెల్లడి కానప్పటికీ, ఈ ప్రకటనతోనే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. భవిష్యత్తులో మహిళల ఐపీఎల్ వేదికపై కూడా ‘విజిల్ పోడు’ నినాదం గట్టిగా వినపడటం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us