AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిటైర్మెంట్ తర్వాత కొత్త పాత్రలో కోహ్లీ, రోహిత్..? ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన అశ్విన్..!

Indian Cricketers Virat Kohli, Rohit Sharma Future: కోహ్లీ ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని కోరుకుంటుంటే, రోహిత్ వ్యూహాత్మక మార్గదర్శకుడిగా కొనసాగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరిద్దరి నిష్క్రమణ భారత క్రికెట్‌లో ఒక సువర్ణ అధ్యాయానికి తెరదించుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రిటైర్మెంట్ తర్వాత కొత్త పాత్రలో కోహ్లీ, రోహిత్..? ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన అశ్విన్..!
Virat Kohli, Rohit Sharma Future
Venkata Chari
|

Updated on: Aug 14, 2026 | 11:33 AM

Share

Indian Cricketers Virat Kohli, Rohit Sharma Future: భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆట నుంచి తప్పుకున్నాక కోచింగ్ బాధ్యతలు చేపడతారా? ఈ ఉత్కంఠకు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెరదించాడు. వీరిద్దరి భవిష్యత్ ప్రయాణాలు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయని, కోహ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ మైదానానికి వెంటనే రాకపోవచ్చని కుండబద్దలు కొట్టాడు. అశ్విన్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడావర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి.

మైదానానికి విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం?

దశాబ్దానికి పైగా భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ వన్డే ఫార్మాట్ ముగింపు దశకు చేరుకున్నారు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ వీరిద్దరికీ ఆఖరి సమరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే టెస్టులు, పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ స్టార్ బ్యాటర్లు రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారనే దానిపై ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది.

ఎక్కువమంది చదివింది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

ఇవి కూడా చదవండి

వీరితో సుదీర్ఘ కాలం పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన సొంత యూట్యూబ్ వేదికగా ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. ఆట నుంచి తప్పుకున్న వెంటనే విరాట్ కోహ్లీ ప్రధాన కోచ్ పదవి చేపడతాడని ఎవరూ ఊహించలేరని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కెరీర్ ఆరంభం నుంచి మైదానంలో ఎనలేని శ్రమకోర్చిన కోహ్లీ, విశ్రాంతి కోరుకుంటున్నాడని తెలిపాడు.

కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్న కింగ్ కోహ్లీ, తన కుటుంబంతో కలిసి లండన్‌లో స్థిరపడ్డాడు. కేవలం కీలకమైన వన్డే సిరీస్‌ల కోసమే భారత్‌కు రాకపోకలు సాగిస్తున్నాడు. ప్రపంచ కప్ ముగిసిన వెంటనే అతడు క్రికెట్ ప్రపంచం నుంచి దూరంగా వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికే అతడు మొగ్గు చూపుతాడని, కోచింగ్ లాంటి పూర్తి స్థాయి ఒత్తిడితో కూడిన బాధ్యతలను స్వీకరించడానికి అతడు సుముఖంగా ఉండకపోవచ్చని అశ్విన్ విశ్లేషించాడు.

ముంబై జట్టుతో రోహిత్ సరికొత్త ప్రయాణం..!

మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి అశ్విన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నాయకుల్లో రోహిత్‌ది అగ్రస్థానం. తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీకి ఏకంగా ఐదు ట్రోఫీలు అందించడంతో పాటు భారత్‌కు పొట్టి ప్రపంచకప్ గెలిపించాడు. మైదానంలో ఎత్తుగడలు వేయడంలో, క్లిష్ట సమయాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో రోహిత్ చాతుర్యం తిరుగులేనిది.

ఆటగాడిగా వీడ్కోలు పలికిన తర్వాత ముంబై ఇండియన్స్ అతడిని తమ మేనేజ్‌మెంట్‌లో చేర్చుకోవడం ఖాయమని అశ్విన్ జోస్యం చెప్పాడు. రోహిత్ లాంటి పదునైన క్రికెట్ మేధస్సు ఉన్న యోధుడిని ముంబై యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని స్పష్టం చేశాడు.

ద్రవిడ్ బాటలోనే హిట్ మ్యాన్ అడుగులు..

ఆటగాడి స్థాయి నుంచి నేరుగా హెడ్ కోచ్ పదవి చేపట్టడం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. అందుకే రోహిత్ కూడా కెరీర్ ముగిసిన వెంటనే ఒత్తిడిని ఆహ్వానించకపోవచ్చు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) గతంలో చేసినట్లే, రోహిత్ కూడా ఒకటి రెండేళ్లు పూర్తి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.

ఎక్కువమంది చదివింది: Team India: వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టెస్ట్‌ల్లో టీమిండియాకు విలన్ అతడేనా..?

ఆ విరామం తర్వాత మైండ్‌ఫుల్‌గా మెంటార్ లేదా ప్రత్యేక వ్యూహకర్తగా ముంబై జట్టుకు తన సేవలు అందిస్తాడని అశ్విన్ వివరించాడు. మైదానం వెలుపల ఉంటూ యువ ఆటగాళ్లను ప్రోత్సహించే గుణం రోహిత్‌కు మెండుగా ఉంది. ద్రవిడ్ ఎలాగైతే కుర్రాళ్లను సానబెట్టి దిగ్గజాలుగా తీర్చిదిద్దాడో, రోహిత్ కూడా భవిష్యత్ తరానికి అలాంటి మార్గదర్శకత్వం అందించగలడని అభిప్రాయపడ్డాడు.

భారత క్రికెట్‌లో పూడ్చలేని లోటు..

క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించిన ఈ ఇద్దరు మహారథులు ఒకేసారి ఆట నుంచి తప్పుకుంటే భారత జట్టులో పూడ్చలేని శూన్యత ఏర్పడుతుంది. మైదానంలో వారి దూకుడు, పరుగుల దాహం ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచాయి. సంప్రదాయక క్రికెట్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో వారు సృష్టించిన రికార్డులను అధిగమించడం రాబోయే తరాలకు పెద్ద సవాలు.

ప్రస్తుతం వీరిద్దరూ వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని గెలిచి తమ కెరీర్‌కు ఘనమైన ముగింపు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. వారి విభిన్న వ్యక్తిత్వాలు, ఆలోచనా సరళి భవిష్యత్ ప్రయాణాన్ని శాసించబోతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us