AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasprit Bumrah: బూమ్ బూమ్ పై బాంబు విసరనున్న బీసీసీఐ! రోహిత్ కు డిప్యూటీగా ఆ ఇద్దరే బెస్ట్ ఛాయిస్?

భారత క్రికెట్ జట్టు టెస్ట్ వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా స్థానంలో కొత్త నేతను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. బుమ్రా గాయాల నేపథ్యం, పనిభారం కారణంగా ఈ నిర్ణయం తీసుకోనుందట. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ వంటి యువ నాయకులను రోహిత్‌కు డిప్యూటీగా పరిశీలిస్తున్నారు. బుమ్రా భారత బౌలింగ్ భవిష్యత్తు కావడంతో అతని ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

Jasprit Bumrah: బూమ్ బూమ్ పై బాంబు విసరనున్న బీసీసీఐ! రోహిత్ కు డిప్యూటీగా ఆ ఇద్దరే బెస్ట్ ఛాయిస్?
బుమ్రా వికెట్లు పడగొట్టడం ఒక్కటే కాదు. ఎకానమీ రేటు కూడా అద్భుతంగా ఉంది. గత 9 సీజన్లలో 5 సీజన్లలో బుమ్రా ఎకానమీ రేటు ఓవర్‌కు 7 పరుగుల కంటే తక్కువగా ఉంది. పెద్ద విషయం ఏమిటంటే బుమ్రా ఎప్పుడూ 8 ఎకానమీ రేటుతో పరుగులు ఇవ్వలేదు. బుమ్రా గణాంకాలు నిజంగా అద్భుతమైనవి.
Narsimha
|

Updated on: May 05, 2025 | 11:10 AM

Share

భారత క్రికెట్ జట్టు పరంగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా నివేదికల ప్రకారం, రాబోయే ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాను కొనసాగించబోమన్న సంకేతాలు బీసీసీఐ నుంచి వెలువడుతున్నాయి. ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్ ఇంగ్లాండ్‌ను సందర్శించనున్న నేపథ్యంలో, బుమ్రా గాయాల అనుభవంతో పాటు పనిభారం నిర్వహణ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, అతని స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నది. గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ లేని సమయంలో బుమ్రా కెప్టెన్సీలో అద్భుత విజయాలను అందించినా, ఐదు టెస్టులన్నింటికీ అతను అందుబాటులో ఉండే అవకాశాలు తగ్గవచ్చన్న అభిప్రాయంతో, భారత క్రికెట్ యాజమాన్యం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.

ఇందులో భాగంగా, శుభ్‌మన్ గిల్ లేదా రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లను రోహిత్ శర్మకు డిప్యూటీగా ఎంపిక చేసే అంశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. ఈ ఇద్దరినీ భారత క్రికెట్ భవిష్యత్తు నాయకత్వ స్థానాల్లో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. యశస్వి జైస్వాల్ పేరు కూడా చర్చలో ఉన్నా, అతని వయసును దృష్టిలో పెట్టుకుని తక్షణ నాయకత్వ భాధ్యతలు అప్పగించకపోవచ్చని తెలుస్తోంది.

ఇక బుమ్రా విషయానికొస్తే, అతను గత కొంతకాలంగా తరచూ గాయాల బారినపడుతూ వస్తున్నాడు. ముఖ్యంగా, గతంలో ఓ వెన్ను గాయంతో ఆయన చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. IPL 2025లో ముంబై ఇండియన్స్ తరపున కొన్ని ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బుమ్రా, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అందుబాటులో లేకపోయాడు. తాజాగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పూర్తయిన తర్వాత అతను మళ్లీ ఆటలోకి అడుగుపెట్టాడు.

ఈ నేపథ్యంలో, బుమ్రా భారత జట్టు కోసం ఒక దీర్ఘకాలం అవసరమైన బౌలర్ కావడం వల్ల అతని ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా నిర్వహించడంపై బీసీసీఐ దృష్టి సారించింది. అందుకే అతనికి మళ్లీ గాయాల భయం లేకుండా క్రికెట్ కొనసాగించేందుకు అవసరమైన పని భారం తగ్గించాలన్నది వారి ఉద్దేశ్యం. అలాగే, ఇంగ్లాండ్ పర్యటన కోసం బీసీసీఐ బౌలింగ్ విభాగంలో పలు ప్రత్యామ్నాయ రిజర్వ్ ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసి, వారిని అవసరానికి వాడే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.