IND vs ENG: టార్గెట్ WTC ఫైనల్.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

ఈ ఏడాది టీం ఇండియా ఆడే సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ఖరారు చేసింది. ఇప్పుడు వచ్చే ఏడాది షెడ్యూల్‌ను కూడా BCCI రిలీజ్ చేసింది. దీని ప్రకారం టీమ్ ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. తాజాగా ఆ ఐదు టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.

IND vs ENG: టార్గెట్ WTC ఫైనల్.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
India Vs England
Follow us

|

Updated on: Aug 23, 2024 | 12:32 PM

ఇటీవలే లంక పర్యటనను పూర్తి చేసుకున్న టీమిండియా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ ఆడనుంది. అప్పటి నుంచి భారత జట్టు పలు సిరీస్‌లలో బిజీగా ఉండనుంది. ఈ ఏడాది టీం ఇండియా ఆడే సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ఖరారు చేసింది. ఇప్పుడు వచ్చే ఏడాది షెడ్యూల్‌ను కూడా BCCI రిలీజ్ చేసింది. దీని ప్రకారం టీమ్ ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. తాజాగా ఆ ఐదు టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. జూన్ 20 నుంచి లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు, జూలై 31న చివరి టెస్టు జరగనుంది. ఇది కాకుండా బర్మింగ్‌హామ్, లార్డ్స్, మాంచెస్టర్ మైదానాలు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పురుషుల జట్టుతో పాటు, భారత మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది, అక్కడ వారు ఐదు T20Iలు, మూడు ODIలు ఆడతారు. భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జూన్ 28 నుంచి జూలై 12 వరకు టీ20 సిరీస్, జూలై 16, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరగనుంది.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్, జూన్ 20-24, హెడ్డింగ్లీ
  • రెండవ టెస్ట్, జూలై 2-6, బర్మింగ్‌హామ్
  • మూడో టెస్టు, జూలై 10-14, లార్డ్స్
  • నాల్గవ టెస్ట్, జూలై 23-27, మాంచెస్టర్
  • ఐదవ టెస్ట్, జూలై 31 – ఆగస్టు 4, లండన్

భారత మహిళల జట్టు షెడ్యూల్

టీ20 సిరీస్

  • మొదటి టీ20, జూన్ 28, నాటింగ్‌హామ్
  • రెండవ T20, జూలై 1, బ్రిస్టల్
  • మూడో టీ20, జూలై 4, లండన్
  • నాల్గవ T20, జూలై 9, మాంచెస్టర్
  • ఐదవ T20, జూలై 12, బర్మింగ్‌హామ్

వన్డే సిరీస్

  • మొదటి వన్డే, జూలై 16, సౌతాంప్టన్
  • రెండో వన్డే, జూలై 19, లార్డ్స్
  • మూడవ ODI, జూలై 22, చెస్టర్-లీ-స్ట్రీట్

భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ పర్యటన చాలా కీలకం. ఎందుకంటే గత 17 ఏళ్లుగా ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవలేదు. 2007లో ఇంగ్లండ్‌లో జరిగిన చివరి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఆ తర్వాత 2021-22లో ఇంగ్లండ్‌ పర్యటనలో విజయానికి చేరువైన టీమ్‌ఇండియా చివరకు టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసింది. గత పర్యటనలో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగినప్పటికీ చివరి టెస్టులో ఓడి సిరీస్‌ను సమం చేసింది. అంతే కాకుండా ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రెండు ఫైనల్స్‌లోనూ టీమిండియా ఓడిపోవడంతో రోహిత్, గంభీర్ జోడీకి ఈ ఇంగ్లండ్ టూర్ అంత సులువు కాదనే విషయం స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..