AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఛాంపియన్స్ ట్రోపీ నుంచి శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?

ICC Champions Trophy: ఈ ఐసీసీ టోర్నీలో భారత్ ఎలాంటి స్వ్కాడ్‌తో బరిలోకి దిగనుందోనని అందరి దృష్టి నెలకొంది. ఇంతలో, ఒక మాజీ భారత ఓపెనర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తన భారత జట్టును ఎంపిక చేశాడు. ఇందులో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లు చోటు దక్కించుకోలేకపోయాడు. అదే సమయంలో యశస్వి జైస్వాల్‌కు లక్కి చాన్స్ ఇచ్చాడు.

Team India: ఛాంపియన్స్ ట్రోపీ నుంచి శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
Team India
Venkata Chari
|

Updated on: Jan 10, 2025 | 1:45 PM

Share

Indian Cricket Team: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇంకా చాలా జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇందులో భారత్ కూడా ఉంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతలో, ఒక మాజీ భారత ఓపెనర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఎంపిక చేశాడు. ఇందులో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లు చేర్చలేదు. అదే సమయంలో, యశస్వి జైస్వాల్‌ను అతని జట్టులో చేర్చి షాకిచ్చాడు.

ఇంగ్లండ్‌తో భారత్ వన్డే సిరీస్‌కి రంగం సిద్ధం..

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇందులో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో టీం ఇండియా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ టోర్నీకి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన భారత జట్టును ఎంపిక చేసుకున్నాడు.

మాజీ ఓపెనర్ ఎవరిని డ్రాప్ చేశాడంటే..

కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఆకాశ్ చోప్రా తన జట్టును ప్రారంభించాడు. రెండో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌ని చేర్చారు. అదే సమయంలో యశస్వి జైస్వాల్‌ను కూడా తన జట్టులో ఎంపిక చేసుకున్నాడు. వీరితో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ముగ్గురు ఆల్ రౌండర్లకు చోటు..

ఆకాశ్ చోప్రా తన జట్టులో ముగ్గురు ఆల్ రౌండర్లను చేర్చుకున్నాడు. ఇందులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ రూపంలో నైపుణ్యం కలిగిన స్పిన్నర్‌ని చేర్చారు. భారత దిగ్గజాలు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ రూపంలో నలుగురు పేసర్లను ఉంచారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఆకాష్ చోప్రా సెలక్ట్ చేసిన భారత జట్టు..

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..