IPL 2025: 10 కోట్ల ప్లేయర్ ను పక్కన పెట్టనున్న హైదరాబాద్! లక్నో తో మ్యాచ్ కి తుది జట్టు ఇదే!
ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ ఆశలు కోల్పోయిన సన్రైజర్స్ హైదరాబాద్, లక్నోతో పోరులో పరువు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో తుది జట్టును రూపొందిస్తోంది. రూ.10 కోట్ల ధరకు తీసుకున్న షమీ అంచనాలను అందుకోలేక బెంచ్కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో జయదేవ్ ఉనాద్కత్ను కొనసాగించే అవకాశం ఉంది. కమిన్స్, హెడ్ తిరిగి జట్టులో చేరగా, SRH తుది జట్టు కీలకమైన మార్పులతో బరిలోకి దిగనుంది.

ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఈ జట్టు, ఇప్పుడు పరువు కోసం మాత్రమే పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుంది. 11 మ్యాచ్ల్లో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ, తదుపరి మూడు మ్యాచ్ల్లో గెలిచినట్లయితే పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానం పొందే అవకాశం ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం లక్నో వేదికగా జరగనున్న మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సీజన్లో సన్రైజర్స్ బౌలింగ్ విభాగం తీవ్రంగా తడిసి మోపెడు అయింది. ముఖ్యంగా రూ.10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన అనుభవజ్ఞుడైన మహమ్మద్ షమీ పూర్తి స్థాయిలో విఫలమయ్యాడు. 9 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి, 11.23 ఎకానమీ రేటుతో నిరాశ పరచిన షమీ, ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్కు కూడా ఎంపిక కాకుండా బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్లోనూ అతనికి చోటు లేకపోవచ్చని భావిస్తున్నారు. అతని స్థానంలో జయదేవ్ ఉనాద్కత్ను కొనసాగించే అవకాశముంది. దీనితోపాటు ఎక్స్ట్రా బ్యాటర్గా అభినవ్ మనోహర్, స్మరణ్ రవిచంద్రన్ లేదా సచిన్ బేబీల్లో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించవచ్చు. షమీ లాంటి అనుభవజ్ఞుడి వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపడమే కాక, ఇతర బౌలర్ల ప్రదర్శన కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం ఆరెంజ్ ఆర్మీని నిరుత్సాహానికి గురిచేసింది.
ఇదిలా ఉంటే, ఇటీవల IPL బ్రేక్ కారణంగా స్వదేశానికి వెళ్లిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తిరిగి జట్టులో చేరారు. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ వంటి బ్యాటర్లు ప్రధాన భుజాలుగా నిలవనున్నారు. ఆల్రౌండర్ కామిందు మెండిస్ స్పిన్ విభాగంలో కీలక భూమిక పోషించనున్నాడు. పేస్ విభాగాన్ని ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్ లు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా జీషన్ అన్సారీ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. అయితే, అతని ప్రదర్శన కూడా ఇప్పటివరకు నిరాశ పరిచిందనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, సోమవారం లక్నోతో తలపడబోయే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కామిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్, జీషన్ అన్సారీ. ఈ మ్యాచ్లో కనీసం పరువు నిలబెట్టుకోవాలని తహతహలాడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు ఇది కీలకమైన సమరం కానుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



