AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టిన డైనమిక్ KKR ఫినిషర్! రోజు ఏం తింటాడో తెలుసా భయ్యా?

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకు సింగ్ తన ఆరోగ్య రహస్యాలను ‘ట్రెయిన్ లైక్ ఎ నైట్’ కార్యక్రమంలో వెల్లడించాడు. వ్యాయామం, డైటింగ్, న్యూట్రిషన్ పట్ల ఇప్పుడు అధిక శ్రద్ధ తీసుకుంటున్న రింకు, ఆటగాడిగా మాత్రమే కాకుండా ఆరోగ్యవంతమైన వ్యక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2025 ఐపీఎల్‌లో రింకుకు ఆశించిన విజయం రాకపోయినా, అతని ప్రొఫెషనల్ వైఖరి అభిమానులకు స్ఫూర్తిగా మారుతోంది. ఫిట్‌నెస్‌ను ప్రధానం చేస్తూ, తద్వారా ఆటలో స్థిరంగా ఉండాలని అతను నిరూపిస్తున్నాడు.

Video: ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టిన డైనమిక్ KKR ఫినిషర్! రోజు ఏం తింటాడో తెలుసా భయ్యా?
Rinku Singh Diet
Narsimha
|

Updated on: May 18, 2025 | 7:59 PM

Share

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సంచలనం రింకు సింగ్ తన ఫిట్‌నెస్ విధానం, వ్యక్తిగత మార్పుల గురించి ఆసక్తికర విషయాలను ఇటీవల ‘ట్రెయిన్ లైక్ ఎ నైట్’ అనే ప్రోగ్రామ్‌లో వెల్లడించాడు. తన క్రికెట్ ప్రయాణం మొదట్లో జిమ్, వ్యాయామాల గురించి పెద్దగా అవగాహన లేని రింకు, ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తున్నాడు. T20 ఫార్మాట్‌లో క్రికెట్ వేగంగా మారుతోందని, ఫిట్‌నెస్ లేకుండా ఆటలో నిలబడలేమని అతను స్పష్టంగా చెప్పారు. జిమ్ ట్రైనింగ్, రన్నింగ్, పోషకాహారం కలిసే తన శక్తి, తేజానికి మూలకారణమని వివరించాడు. ప్రస్తుతం తాను డైటింగ్‌ను మొదలుపెట్టి 15-20 రోజులు అయినట్లు పేర్కొన్న రింకు, “ఇప్పటికే నాకు 27 ఏళ్లు అయినా, ఇది ఇప్పుడు చాలా అవసరం,” అంటూ నవ్వుతూ చెప్పాడు.

రింకు తన రోజును వేడి నీటితో ప్రారంభించి, ఆరోగ్యకరమైన అల్పాహారంగా గుడ్లు, పోహా, దోసెలు తీసుకుంటాడు. ఒకప్పుడు ఎక్కువగా చికెన్ మీద ఆసక్తి చూపే రింకు, ఇప్పుడు ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్టులతో కలిసి పనిచేస్తూ కూరగాయలు, సమతుల్యాహారాన్ని ప్రాధాన్యమిస్తున్నాడు. తన U-16 కాలంలో జిమ్ గురించి తెలియదని, ఆ సమయంలో రన్నింగ్ మాత్రమే చేస్తానని, కానీ U-19, సీనియర్ క్రికెట్ ఆడిన తర్వాతే వ్యాయామం, ఫిట్‌నెస్ ప్రాముఖ్యత తెలుసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు జిమ్‌కు వెళ్లడం, వ్యాయామం చేయడం తనకు ఆనందాన్నిస్తోందని వెల్లడించాడు.

రింకు సింగ్, IPL 2023లో యష్ దయాల్‌పై ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆ ఆటలో KKR కోసం అద్భుత విజయాన్ని అందించిన అతను, అప్పటి నుంచి టీమిండియా T20 జట్టులో రెగ్యులర్ ముఖంగా మారాడు. IPL 2025 మెగా వేలానికి ముందు, KKR ఫ్రాంచైజీ అతనిని రూ.13 కోట్లకు నిలుపుకోవడం, అతని ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అయినప్పటికీ, 2025 సీజన్ రింకు కోసం ఆశించినంత విజయవంతంగా సాగలేదు. 12 మ్యాచ్‌ల్లో కేవలం 197 పరుగులు మాత్రమే చేసి, 32.83 సగటు మాత్రమే సాధించాడు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన KKR జట్టు కూడా ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించక, పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి పరిమితమయ్యింది.

ఈ పరిస్థితుల మధ్య కూడా, రింకు తన ఫిట్‌నెస్‌ కే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడు. ఆటలో సరైన స్థాయికి చేరాలంటే శారీరక దృఢత ఎంత ముఖ్యమో అతను బాగా అర్థం చేసుకున్నాడు. ఆటగాడిగా మాత్రమే కాకుండా, ఆరోగ్యవంతమైన వ్యక్తిగా ఎదగడానికి చేస్తున్న కృషి, ఇతర యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తోంది. రింకు సింగ్ ప్రయాణం, ప్రాముఖ్యత పొందిన తర్వాత కూడా తన ఆరోగ్యం, శ్రమపై ఇచ్చే గౌరవం నిజంగా ప్రశంసనీయమైనది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..