AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonweath Games 2022: ఫైనల్ చేరిన భారత సైక్లిస్ట్ విశ్వజిత్ సింగ్.. మరో పతకం ఖాయం..

భారత సైక్లిస్ట్ విశ్వజిత్ సింగ్ కామన్వెల్త్ గేమ్స్ 2022 పురుషుల 15 కి.మీ స్క్రాచ్ రేస్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. విశ్వజీత్ తన హీట్‌లో ఐదో స్థానంలో నిలిచాడు.

Commonweath Games 2022: ఫైనల్ చేరిన భారత సైక్లిస్ట్ విశ్వజిత్ సింగ్.. మరో పతకం ఖాయం..
Vishavjeet Singh
Venkata Chari
|

Updated on: Jul 31, 2022 | 9:47 PM

Share

విశ్వజీత్ సింగ్, తన హీట్‌లో ఐదో స్థానంలో నిలిచిన తర్వాత ప్రస్తుతం ఫైనల్‌లో బంగారు పతకం కోసం తన వాదనను ప్రదర్శించనున్నాడు. రేపు జరిగే ఫైనల్‌లో భారత సైక్లిస్ట్ విశ్వజిత్ సింగ్ బంగారు పతకం కోసం బరిలోకి దిగనున్నాడు. అదే సమయంలో, ఈ రోజున జెరెమీ లాల్రిన్నుంగా వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. నిన్న మీరాబాయి చాను భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్‌ను భారత్ సులువుగా ఓడించింది..

ఇవి కూడా చదవండి

అదే సమయంలో, భారత మహిళల జట్టు క్రికెట్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 18 ఓవర్లలో కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 11.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసి విజయం సాధించింది. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. షెఫాలీ వర్మ 16 పరుగులు చేయగా, స్మృతి మంధాన 42 బంతుల్లో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. విశేషమేమిటంటే, భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.