AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs IND: తొలి టీ20 ఓటమితో వెస్టిండీస్‌కు మరో షాక్.. అలా చేయడంపై థర్డ్ అంపైర్ ఏం చేశాడంటే?

భారత్‌తో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా కూడా ఎదుర్కొంది.

WI vs IND: తొలి టీ20 ఓటమితో వెస్టిండీస్‌కు మరో షాక్.. అలా చేయడంపై థర్డ్ అంపైర్ ఏం చేశాడంటే?
Wi Vs Ind
Venkata Chari
|

Updated on: Jul 31, 2022 | 2:54 PM

Share

వెస్టిండీస్ ఆటగాళ్ల జేబులకు చిల్లు పడింది. అదేంటి, మ్యాచ్ ఓడితే, జేబుకు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా. అక్కడికే వస్తున్నాం. భారత్‌తో జరిగిన మొదటి T20Iలో , వెస్టిండీస్ జట్టు ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా, స్లో ఓవర్ రేట్ కారణంగా వారికి జరిమానా కూడా పడింది. అంటే, మ్యాచ్ ఓడిపోవడంతోపాటు వారికి వచ్చే మ్యాచ్ ఫీజులో కూడా కోత పడిందన్నమాట. దీంతో ఒకే మ్యాచ్‌లో రెండు నష్టాలను చవిచూశారు. నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తగ్గించినందుకు వెస్టిండీస్ జట్టుకు జరిమానా పడింది. దీని కింద వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ట్రినిడాడ్‌లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి వన్డే తర్వాత మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఈ చర్య తీసుకున్నారు. ICC ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.22 జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినట్లు తేలితే మ్యాచ్ ఫీజులో 20 శాతం తగ్గింపును పేర్కొంది.

తప్పును అంగీకరించిన నికోలస్ పూరన్..

స్లో ఓవర్ రేట్ విషయంలో తాను చేసిన తప్పును వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అంగీకరించాడు. కాబట్టి, ఇప్పుడు ఈ విషయంలో తదుపరి విచారణ లేదా చర్య అవసరం లేదు. స్లో ఓవర్ రేట్‌పై ఫీల్డ్ అంపైర్ ఫిర్యాదు చేశారు.

తొలి టీ20లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం..

భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆగస్టు 1న జరగనుంది. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 64 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్‌తో పాటు, దినేష్ కార్తీక్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు.

తొలి టీ20లో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దానికి సమాధానంగా అర్ష్‌దీప్‌ సింగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌ల బలమైన బౌలింగ్‌ ముందు వెస్టిండీస్‌ జట్టు కేవలం 122 పరుగులకే ఆగిపోయి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.