AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. విష్ణు పుష్కరిణిలో 11 నుంచి స్నాన సంకల్పం.. ప్రారంభం

శ్రీ విష్ణుపుష్కరిణిలో స్నానమాచరించే దంపతులు లేదా ఇద్దరికి పురోహితులతో గోత్ర నామాల సంకల్పం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పిస్తామని ఈవో భాస్కర్రావు తెలిపారు. స్నాన సంకల్పం టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. దీన్ని ఆగస్టు 11వ తేదీ స్వాతినక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. విష్ణు పుష్కరిణిలో 11 నుంచి స్నాన సంకల్పం.. ప్రారంభం
Yadadri Temple
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 06, 2024 | 12:47 PM

Share

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు కొండపైనే గల విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే భాగ్యం కలగనుంది. ఇందు కోసం దేవస్థానం అధికారులు విష్ణు పుష్కరిణిని అందుబాటులోకి తీసుకురానున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని గత ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టింది. దీంతో యాదగిరిగుట్ట కొండపై ప్రధానాలయాన్ని విస్తరించారు. పదేళ్ల క్రితం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకునే దంపతులు, భక్తులు కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం ఆచరించేవారు. ప్రధానాలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద లక్ష్మీ పుష్కరిణిని ఏర్పాటు చేశారు. అప్పటినుండి భక్తులు కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో స్నాన సంకల్పం చేసుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ విధానంతో భక్తులకు ఇబ్బందిగా మారింది. దీంతో దేవస్థానం అధికారులు.. గతంలో మాదిరిగానే భక్తులకు విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం పునఃప్రారంభానికి ఏర్పాటు చేస్తున్నారు.

భక్తుల కోరిక మేరకు విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్నాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో భాస్కరరావు విష్ణు పుష్కరిణిని అధికారులతో కలిసి పరిశీలించారు. శ్రీ విష్ణుపుష్కరిణిలో స్నానమాచరించే దంపతులు లేదా ఇద్దరికి పురోహితులతో గోత్ర నామాల సంకల్పం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పిస్తామని ఈవో భాస్కర్రావు తెలిపారు. స్నాన సంకల్పం టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. దీన్ని ఆగస్టు 11వ తేదీ స్వాతినక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

టికెట్ లేని భక్తులు విష్ణు పుష్కరిణిలో నీటిని తలపై చల్లుకునేందుకు వీలుకల్పిస్తారు. కాగా.. పుష్కరిణిలో చెత్తా చెదారాన్ని తొలగించి, పై భాగంలో జాలీ (మెష్)ఏర్పాటు చేసి, తెలుపు రంగు పెయింటింగ్ తో దేవస్థానం అధికారులు ముస్తాబు చేస్తున్నారు. గతంలో మాదిరిగానే కొండపై విష్ణు పుష్కరిణిలో స్థాన సంకల్పానికి అధికారులు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం చేసి స్వామి వారిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తిరిగి పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?