AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laskar Bonal : ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించేందుకు .. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి

Laskar Bonal : ఆషాఢమాసం వస్తుందంటే తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భాగ్య నగరంలో బోనాల ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఆషాఢంలోని మూడో ఆదివారం..

Laskar Bonal : ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించేందుకు .. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి
Laskar Bonal
Surya Kala
|

Updated on: Jul 04, 2021 | 11:51 AM

Share

Laskar Bonal : ఆషాఢమాసం వస్తుందంటే తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భాగ్య నగరంలో బోనాల ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఆషాఢంలోని మూడో ఆదివారం జరిగే లష్కర్ బోనాలు వెరీ వెరీ స్పెషల్. బోనమెత్తిన మహిళలు సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి చేరుకుంటారు. భక్తి శ్రద్దలతో బోనం అమ్మవారికి సమర్పిస్తారు. కరోనా రాక ముందు వరకూ బోనాల పండగ అంటే ఎంతో సందడి ఉండేది.. భారీ సంఖ్యలో మహిళలు బోనం అమ్మవారికి స్వయంగా సమర్పించేవారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వయంగా అమ్మవారికి బోనం సమర్పించే పరిస్థితులు లేవు. దీంతో ఉజ్జయిని ఆలయ నిర్వాహకులు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ ఏడాది లష్కర్‌ బోనాలతో ఓ వినూత్న ప్రయోగంతో దేవాదాయ-పోస్టాఫీస్ శాఖ కలిపి సంయుక్తంగా భక్తుల ముందుకు రానున్నాయి.

బోనం సమర్పించాలనుకునే మహిళలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని గోత్రనామాలు నమోదు చేస్తే వారి పేరు మీదుగా అమ్మవారికి ఆలయ అధికారులు బోనాన్ని సమర్పిస్తారు. అనంతరం బియ్యం పసుపు కుంకుమలను ప్రసాదంగా పోస్టు ద్వారా ఇంటికి పంపుతారు. వాటిని వండుకుని ప్రసాదంగా స్వీకరించొచ్చు. లాక్ డౌన్ ఎత్తేసినా ఇంకా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. జనం గుంపు గుంపులునా ఉండే పరిస్థితులు లేవు.. దీంతో ఇప్పటికే భద్రాద్రి రామయ్య కల్యాణానికి చేసినట్లు బోనాలకు ఆన్ లైన్ సదుపాయాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. బోనాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా బోనం సమర్పించడానికి రూ.200 లను తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.

బోనం సమర్పించాలనుకునే భక్తులు ఆ రుసుమును పోస్టాఫీసుల్లో చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంది. అనంతరం భక్తుల పేరుతో ఉజ్జయినీ మహంకాళీకి ఆలయ సిబ్బంది బోనం సమర్పించి అందులోని బియ్యం నుంచి 20 గ్రాములు, కుంకుమ, పొడి ప్రసాదాన్ని పోస్టు ద్వారా వారి ఇంటికి పంపుతారు. ఈ మేరకు దేవాదాయ శాఖ తపాల శాఖతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. వినాయక చవితికి కూడా ఆన్ లైన్ సేవలను తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తుంది.

Also Read: రన్నింగ్ స్కిప్పింగ్ ల్లో ఏది మంచిది .. ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటే..