AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goddess Sita: నేపాల్‌లో సీతాదేవి ఆలయం సీతామర్హి నుంచి ఎంత దూరంలో ఉంది.. ఎలా చేరుకోవాలంటే..

బీహార్లోని సీతామార్హిలో ఉన్న పునౌరాలో సీతాదేవి ఆలయం నిర్మించనున్నారు. ఈ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఇప్పటికే జరుపుకుంది. హోంమంత్రి అమిత్ షా పునాది రాయి వేశారు. సీతాదేవి ఇక్కడే జన్మించిందని నమ్ముతారు. కానీ నేపాల్‌లోని జనక్‌పూర్‌లో కూడా సీతామాత గొప్ప ఆలయం నిర్మించబడింది. ఈ ప్రదేశం సీతామార్హి కి గంటన్నర ప్రయాణించే సమయం దూరంలో ఉంది. ఇది ఆమె పుట్టుకతో కూడా ముడిపడి ఉంది.

Goddess Sita: నేపాల్‌లో సీతాదేవి ఆలయం సీతామర్హి నుంచి ఎంత దూరంలో ఉంది.. ఎలా చేరుకోవాలంటే..
Sita Temple Nepal
Surya Kala
|

Updated on: Aug 09, 2025 | 11:21 AM

Share

బీహార్‌లోని సీతామర్హిలో జానకి ఆలయ శంకుస్థాపన జరిగింది. హోంమంత్రి అమిత్ షా ఇక్కడ భూమి పూజ చేశారు. ఉప ముఖ్యమంత్రి, సీఎం నితీష్ కుమార్ సహా పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రదేశం సీతామర్హి జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇప్పటికే సీతామాత ఆలయం ఉంది. ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్త ఆలయ నిర్మాణానికి మొదటి పునాది వేయబడింది. ఈ ఆలయం సీతామర్హిలోని పునౌరాలో నిర్మించబడుతుంది. దీనికి కారణం చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రదేశం ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి. జనక మహారాజు పొలం దున్నుతున్నప్పుడు సీతదేవి భూమి నున్క౯ఇ జన్మించిందని చెబుతారు. అయితే ఇదే తరహాలో నేపాల్‌లోని తెరాయ్ ప్రాంతంలోని జనక్‌పూర్‌లో సీతాదేవి గొప్ప ఆలయం కూడా నిర్మించబడింది. ఇది ప్రజలకు విశ్వాస కేంద్రంగా ఉంది. ఈ స్థలాన్ని జనక్‌పూర్ధామ్ అని పిలుస్తారు. చాలా మంది ప్రజలు ఇక్కడే సీతమాత జన్మించిందని కూడా నమ్ముతారు. సీతామర్హి , నేపాల్ మధ్య దూరం ఎంత ఉంది? జనక్‌పూర్‌కు ఎలా చేరుకోగలరు ఈ రోజు తెలుసుకుందాం..

జనక్‌పూర్‌ను మిథిలా రాజు జనకుడి రాజధానిగా పరిగణిస్తారు.సీత జననంతో పాటు, ఈ ప్రదేశం సీతా రాముడి వివాహం జరిగిన కారణంగా కూడా చాలా ముఖ్యమైనదిగా ప్రసిద్ధి చెందింది. సీతాదేవి తన కుమార్తెగా భావించిన జనక రాజు ఇక్కడే పెంచాడని చెబుతారు. నేపాల్‌లోని ఈ సీతా ఆలయం గురించి.. ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు.. దర్శనం చేసుకోవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

నిర్మాణ శైలి, కళాఖండం నేపాల్‌లో నిర్మించిన సీతాదేవి ఆలయం రాజ్‌పుత్-హిందూ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఈ మూడు అంతస్తుల్లో ఉండే ఆలయం చాలా గొప్పగా ఉంటుంది. ఇది పూర్తిగా తెల్లటి రాళ్లతో నిర్మించబడింది. సీత శ్రీరాముడి వివాహాన్ని సూచించే స్వయంవర మండపం కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మించబడింది. ఈ నిర్మాణం దాని అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది.

ఆలయ చరిత్ర పురాతనమైనది ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీనికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. దీనిని 1911 లో మహారాణి వృషభాను కుమారి నిర్మించారు. ఆ సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించడానికి 9 లక్షల రూపాయలు ఖర్చయిందని, అందుకే ఈ ఆలయాన్ని నౌలఖ అని కూడా పిలుస్తారు. మహారాణి తనకు కొడుకు పుట్టాలనే కోరికతో సీతాదేవి ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

ఈ ఆలయ మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం చుట్టూ 115 సరస్సులు, చెరువులు నిర్మించబడ్డాయి. ఇవి భక్తులకు ఆకర్షణీయ కేంద్రంగా ఉన్నాయి. ఎవరైనా సీతాదేవి ఆలయాన్ని సందర్శించడానికి వెళితే ఇక్కడ ఉన్న సరస్సులను కూడా సందర్శించాలి. వీటిలో పరశురామ సాగర్, ధనుష్ సాగర్, గంగా సాగర్ మొదలైనవి అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలు. వివాహ పంచమి రోజున ఇక్కడ భిన్నమైన పండుగ వాతావరణం ఉంటుంది. వివాహ పంచమి వేడుకని చాలా వైభవంగా జరుపుకుంటారు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

ఇక్కడికి ఎలా చేరుకోవాలి బీహార్‌లోని సీతామర్హి నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు దూరం దాదాపు 51 కి.మీ. ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఈ మార్గం సీతామర్హి భిత్తమోద్ సరిహద్దు, జనక్‌పూర్ గుండా వెళుతుంది. ఈ మార్గం భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది. రెగ్యులర్ బోర్డర్ చెకింగ్ మొదలైన వాటికి కొంత సమయం పట్టవచ్చు. సీతామర్హి జంక్షన్ నుంచి రైలు ప్రయాణం చేయాలంటే.. నేపాల్‌కు నేరుగా రైలు లేదు. జనక్‌పూర్ రోడ్ స్టేషన్‌లో దిగాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 30 నుంచి 35 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కనుక ప్రజలు నేరుగా రోడ్డు మార్గంలో సీతాదేవి ఆలయానికి వెళ్లడానికి ఇష్టపడతారు. బస్సులో వెళ్లి స్థానిక టెంపో, టాక్సీలో వెళ్ళవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి వీసా లేదా పాస్‌పోర్ట్ అవసరం లేదు.అయితే రెగ్యులర్ చెకింగ్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..