AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati City: ఈ నెల 24న 893వ పుట్టిన రోజుని జరుపుకోనున్న తిరుపతి నగరం.. భారీగా ఏర్పాట్లు

సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్ర సోమవరం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించి, నిత్య కైంకర్యములు చేసి, నాలుగు మాడ వీధులను అగ్రహారాలతో తిరుపతిని నిర్మించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దేవాలయం చుట్టూ ఉన్న ఇతర సంఘాలు తిరుపతిగా మారాయి.

Tirupati City: ఈ నెల 24న 893వ పుట్టిన రోజుని జరుపుకోనున్న తిరుపతి నగరం.. భారీగా ఏర్పాట్లు
893 Years Ago Tirupati
Surya Kala
|

Updated on: Feb 22, 2023 | 2:59 PM

Share

హిందువుల పుణ్యక్షేత్రం తిరుపతి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రాన్ని  ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని” అని అంటారు. శ్రీ మహా విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో ఇది ఒకటి. రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది. ఈ చారిత్రక నగరం మరో రెండు రోజుల్లో పుట్టిన రోజుని జరుపుకోనుంది. వివరాల్లోకి వెళ్తే..

తిరుపతి నగరం క్రీ.శ.1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నగరం ఫిబ్రవరి 24, శుక్రవారం నాడు తన 893వ పుట్టినరోజును జరుపుకోనుంది. 893 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. పట్టణ అభివృద్ధికి నాంది పలికారు.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గతేడాది ఫిబ్రవరి 20న పురాతన శాసనాలను తెప్పించారు. ఇందులో ఈ నగరానికి 1130 ఫిబ్రవరి 24న రామానుజాచార్యులుశంకుస్థాపన చేసినట్లు రుజువులుదొరికాయి. ఈ ఆధారాలు టీటీడీ ఆధ్వర్యంలోని గోవిందరాజ ఆలయంలో వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

“సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్ర సోమవరం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించి, నిత్య కైంకర్యములు చేసి, నాలుగు మాడ వీధులను అగ్రహారాలతో తిరుపతిని నిర్మించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దేవాలయం చుట్టూ ఉన్న ఇతర సంఘాలు తిరుపతిగా మారాయి. ఈ క్షేత్రం నేడు భారతదేశంలో హిందువుల ఆరాధనకు చిహ్నంగా మారింది. యు ప్రపంచంలోని అత్యంత ధనిక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉంది, ”అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు.. రామానుజుల రాకకు ముందు తిరుపతి లేదన్నారు. తిరుచానూరులో శ్రీవారి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పండుగల కోసం అనేక ప్రదేశాలు ఉన్నాయి.. కానీ మరే ఇతర నగరంలో కూడా ఆ నగర స్థాపనకు ఖచ్చితమైన తేదీ లేదు, ”అని చెప్పారు.

“తిరుమల ఆలయంలో సమతా ధర్మాన్ని స్థాపించి, పూజా కైంకర్యములను రూపొందించిన భగవద్ రామానుజులు తిరుపతి నగరానికి మూలకర్త. క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు. అందుకే ఇది చాలా కాలం పాటు రామానుజ పురంగా ​​గౌరవించబడింది. “ఈ పట్టణాన్ని మొదట గోవిందరాజ పట్టణం అని, తరువాత రామానుజ పురం అని, 13వ శతాబ్దం ప్రారంభం నుండి తిరుపతి అని పిలిచేవారు” అని మ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు.

జన్మదిన వేడుకలు ప్రజలకే కాదు.. తిరుమలకు ముఖద్వారమైన తిరుపతి లాంటి నగరానికి, శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రానికి కూడా జన్మదిన వేడుకలు ముఖ్యమన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ గోవిందరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి,  నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పౌర సంఘం అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..