AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharad Purnima: నేడు కాముని పున్నమి.. చంద్రుని కాంతిలో ఠాకూర్ బాంకే బిహారీ దర్శనం .. బృందావన్‌లో భక్తుల రద్దీ

శరత్ పూర్ణిమ రోజున, ఠాకూర్ బాంకే బిహారీ మహారాజ్ చంద్రుని కాంతిలో భక్తులకు దర్శనం ఇస్తాడు. దీని కోసం ఠాకూర్ జీ జగ్మోహనుడి దగ్గరకు వస్తాడు. ఈ సందర్భంగా ఠాకూర్ బాంకే బిహారీ జీ మహారాజ్‌కు ఖీర్‌ను ప్రసాదంగా అందజేస్తారు.

Sharad Purnima: నేడు కాముని పున్నమి.. చంద్రుని కాంతిలో ఠాకూర్ బాంకే బిహారీ దర్శనం .. బృందావన్‌లో భక్తుల రద్దీ
Sharad Purnima 2022
Surya Kala
|

Updated on: Oct 09, 2022 | 9:29 AM

Share

ఆశ్వియుజ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమిని శరత్ పూర్ణిమ లేదా కాముని పున్నమి అని పిలుస్తారు. శరత్ పౌర్ణమి సందర్భంగా  ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ఘనంగా వేడుకలను జరుపుతారు. ఠాకూర్ జీ  దైవ దర్శనం ఇవ్వనున్నారు.  ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఠాకూర్ జీని తెల్లటి వస్త్రాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా తెల్లటి బుడగలతో అందంగా అలంకరించారు. ఆలయ  ప్రాంగణం పౌర్ణమి వెలుతురులో స్నానం చేయబడుతుంది. ప్రతి సంవత్సరం ఠాకూర్ బాంకే బిహారీ ఆలయంలో శరద్ పూర్ణిమ పండుగను ఘనంగా జరుపుతారు.

ఆలయ నిర్వాహకుల ప్రకారం ఠాకూర్ బాంకే బిహారీ మహారాజ్ శరద్ పూర్ణిమ రోజున ప్రత్యేక దర్శనం ఇస్తారు. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఠాకూర్ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ఈసారి కూడా భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా ఠాకూర్ జీకి తెల్లని వస్త్రాలను ధరింపజేసి.. ఆలయ అలంకరణ పనులు పూర్తి చేశారు.

ఠాకూర్ జీని తెల్లటి సింహాసనంపై కూర్చోబెడతారు శరత్ పూర్ణిమ రోజున ఠాకూర్ బాంకే బిహారీ ఆలయాన్ని తెల్లటి రంగు బెలూన్లతో అలంకరించారు. ఈ సందర్భంగా ఠాకూర్ బాంకే బిహారీ మహారాజ్ రూపం తెలుపు రంగులో దర్శనమిస్తారు. నేడు శరద్ పూర్ణిమ సందర్భంగా.. బాంకే బిహారీ జీ తెల్లటి సింహాసనంపై కూర్చోనున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి బృందావనానికి చేరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

చంద్రకాంతిలో ప్రకాశించే ఠాకూర్ జీ: శరత్ పూర్ణిమ రోజున, ఠాకూర్ బాంకే బిహారీ మహారాజ్ చంద్రుని కాంతిలో భక్తులకు దర్శనం ఇస్తాడు. దీని కోసం ఠాకూర్ జీ జగ్మోహనుడి దగ్గరకు వస్తాడు. ఈ సందర్భంగా ఠాకూర్ బాంకే బిహారీ జీ మహారాజ్‌కు ఖీర్‌ను ప్రసాదంగా అందజేస్తారు. అనంతరం ఈ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. ఇందుకోసం వివిధ రకాల ఖీర్‌లను తయారు చేస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి: శరత్ పూర్ణిమ రోజున ఠాకూర్ జీ ఆలయంలో భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ఆలయ అధికారులు  జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఆలయ నిర్వాహకులు నిబంధనలలో కొన్ని మార్పులు చేస్తుండగా, పరిపాలన విభాగం కూడా అలర్ట్ అయింది. ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం..  ఠాకూర్ బాంకే బిహారీ ఈరోజు మధ్యాహ్నం 1:00 గంట నుంచి రాత్రి 10:30 గంటల వరకు భక్తులకు దర్శనం ఇస్తారు. మరోవైపు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా బందోబస్తు కోసం ఒకరోజు ముందు నుంచే భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించింది. దీంతో పాటు భక్తుల సౌకర్యార్థం ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..