AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadrachalam: ఈ నెల 16 నుంచి భద్రాద్రి రామయ్యకు నూతన సేవలు.. ఏ సేవలకు ఎంత రుసుము చెల్లించాలంటే..

సీతారాములకు నూతన పూజలను, సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానుందని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. ఈ నెల 16 నుంచి పూజలను, సేవలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. అయితే ఇప్పటికే నిర్వహిస్తున్న పూజలు, సేవలు యధాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు రమాదేవి

Bhadrachalam: ఈ నెల 16 నుంచి భద్రాద్రి రామయ్యకు నూతన సేవలు.. ఏ సేవలకు ఎంత రుసుము చెల్లించాలంటే..
Bhadrachalam Temple
Surya Kala
|

Updated on: Apr 10, 2023 | 8:21 AM

Share

దక్షిణ అయోధ్య భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లతో పాటు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వస్తూ ఉంటారు. సీతారాములను దర్శించుకుని పూజాదికార్యక్రమాలు నిర్వహించి తమ మొక్కలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సీతారాములకు నూతన పూజలను, సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానుందని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. ఈ నెల 16 నుంచి పూజలను, సేవలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. అయితే ఇప్పటికే నిర్వహిస్తున్న పూజలు, సేవలు యధాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు రమాదేవి. ఏఏ సేవలు ఏ సమయంలో భక్తులకు అందుబాటులో ఉందనున్నాయి.. ఎంత రుసుము వసూలు చేయనున్నారో తెలుసుకుందాం..

ఆలయంలో అర్చకులతో వేదాశీర్వాదం: సీతారాములను దర్శనం చేసుకున్న అనంతరం.. ఈ వేదాశీర్వచనాన్ని ఆలయంలోని బేడా మండపంలో చేయనున్నారు. ఈ ఆశీర్వాదం ఉదయం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండనుంది. వేదాశీర్వచనం కోసం చెల్లించాల్సిన రుసుము రూ. 500.

స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ: ఈ సేవనే ఉదయాస్తమాన సేవ అని కూడా పిలుస్తారు. రోజూ భక్తులకు ఈ సేవ అందుబాటులో ఉండనుంది. ఒక్క టికెట్ పై ఒకరికి లేదా దంపతులకు ప్రవేశం ఉంటుంది. ఈ సేవకు ధర రూ. 5000. అయితే ఆదివారం వారం మాత్రం పది టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ సేవ టికెట్ ను తీసుకున్నవారు స్వామివారి సుప్రభాతం నుంచి మొదలు అభిషేకం, అంతరాలయ అర్చన, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి అర్చన, శ్రీ ఆంజనేయస్వామి అర్చన, నిత్య కల్యాణంలో పాల్గొనవచ్చు. అంతేకాదు దర్బారు సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ ఆ రోజు మొత్తంలో ఆలయంలో జరిగే వివిధ సేవలను అర్చనల్లో పాల్గొనవచ్చు.

తులసి మాల అలంకరణ: సీతారామచంద్ర స్వామికి ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు తులసిమాలను సమర్పించవచ్చు. అనంతరం ఈ మాలను ప్రసాదంగా అందిస్తారు. ఈ మాల అలంకరణ సేవకు రుసుము రూ.1000. ఈ సేవలో ఒకరు లేదా దంపతులు పాల్గొనే అవకాశం

నిత్య పూలదండల అలంకరణ: ఆదివారం మినహా ప్రతి రోజూ అందుబాటులో ఉండే ఈ సేవలో ప్రధానాలయంలోని స్వామివారితో పాటు అనుబంధంగా ఉన్న ఆలయాల్లో పూలదండలు సమర్పించవచ్చు. ఈ సేవలో పాల్గొనాలంటే..రుసుము రూ. 5 వేలు.

ముత్యాల సమర్పణ: భద్రాద్రిలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా జరిగే సీతారాముల కల్యాణంలో ఉపయోగించే ముత్యాల కోసం ఇప్పటినుంచి డబ్బులను చెల్లించవచ్చు. శ్రీరామ నవమి ముత్యాల కోసం రూ. 10,000 లను చెల్లించాల్సి ఉంది. అంతేకాదు ఈ సేవ టికెట్ ను తీసుకున్నవారికి  ఆ రోజు కళ్యాణం జరిగే సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు రెండు టికెట్లను భక్తులకుఇస్తారు.

తులాభారం: స్వామివారికి తులాభారం సమర్పించాలంటే.. ప్రతి రోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇందుకు గాను రుసుము రూ.100.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం