Navaratri 2022: బాసర సరస్వతి ఆలయంలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం.. మధుకరం దీక్ష చేపట్టే భక్తులు భారీగా వస్తారని అంచనా..

బాసర సరస్వతి ఆలయంలో దసరా ఉత్సవాలు విభిన్నంగా సాగుతాయి. మిగతా శక్తి స్వరూపిణి ఆలయాల్లో 9 రోజులు 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. బాసర ఆలయంలో మాత్రం అమ్మవారి మూల విగ్రహానికి మొదటి రోజు అభిషేకం నిర్వహించిన

Navaratri 2022: బాసర సరస్వతి ఆలయంలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం.. మధుకరం దీక్ష చేపట్టే భక్తులు భారీగా వస్తారని అంచనా..
Basara Saraswathi Temple
Follow us

|

Updated on: Sep 25, 2022 | 2:54 PM

Navaratri 2022: బాసర సరస్వతి ఆలయంలో (Basara Saraswathi Temple) శారదీయ నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 26 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. శాక్తేయ సాంప్రదాయం ప్రకారం నిర్వహించే ఉత్సవాలు ఆలయంలో 10 రోజులపాటు కన్నుల పండుగగా సాగుతాయి. నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో శక్తిరూపిణి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని‌ దర్శించుకునేందుకు వేలాది భక్తులు తరలివస్తారు.

మొదటిరోజు శైలపుత్రికగా, రెండవ రోజు బ్రహ్మచారిని, మూడవ రోజు చంద్రగంట,నాలుగో రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయని, ఏడవ రోజు కాలరాత్రి, ఎనిమిదవ రోజు మహా గౌరీ, తొమ్మిదవ రోజు సిద్ది ధాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ రెండవ తేదీన ఆలయంలో మూలా నక్షత్ర సరస్వతి పూజ నిర్వహిస్తారు. ఈ శుభ ముహూర్తాన తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. రద్దీ దృష్ట్యా ఉదయం 3 గంటల నుండి చిన్నారులకు నాలుగు మండపాలు అక్షర శ్రీకర పూజలు నిర్వహిస్తారు.

బాసర సరస్వతి ఆలయంలో దసరా ఉత్సవాలు విభిన్నంగా సాగుతాయి. మిగతా శక్తి స్వరూపిణి ఆలయాల్లో 9 రోజులు 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. బాసర ఆలయంలో మాత్రం అమ్మవారి మూల విగ్రహానికి మొదటి రోజు అభిషేకం నిర్వహించిన అనంతరం నవమి వరకు ఎనిమిది రోజులపాటు అభిషేకం నిర్వహించరు. సాధారణ రోజుల్లో ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకం జరుపుతారు. దసరా ఉత్సవాల్లో మాత్రం అభిషేకం జరగదు. ఉత్సవ విగ్రహానికి తొమ్మిది రోజులపాటు శక్తి స్వరూపిణి అలంకరణలు చేస్తారు. అమ్మవారి దర్శనానికి మగవారు అర్ధ శరీరంపై ఎలాంటి దుస్తులు లేకుండా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. నవమి రోజు నవ నిర్వహించి పూర్ణాహుతి చేస్తారు. దసరా రోజు అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం నెమలి పల్లకిలో అమ్మవారిని ఆలయము, బాసర గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. శమీ పూజ, సాయంకాల పూజలు అనంతరం ఉత్సవాలు ముగుస్తాయి. నవరాత్రుల్లో మధుకరం అనే అమ్మవారి దీక్ష చేపట్టేందుకు అధిక సంఖ్యలో భక్తులు బాసర ఆలయానికి చేరుకుంటారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలోనే ఉండి బాసర గ్రామంలో భిక్షాటన చేసి అమ్మవారిని దర్శిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు