Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామయ్య భక్తులకు అలెర్ట్.. బాల రామయ్యకు రోజూ గంట పాటు విశ్రాంతి.. ఈ సమయంలో ఆలయం మూసివేత..

జనవరి 23వ తేదీ నుంచి తెల్లవారు జామున 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భక్తులను 'దర్శనానికి' అనుమతించడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.. ఇది రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది. అంటే ఉదయం 6.00 నుంచి రాత్రి 10.00 గం. వరకు రామ్ లల్లా దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక నుంచి ఒక గంట పాటు రామయ్య దర్శనం కోసం విరామం ఇవ్వనున్నారు. 

Ayodhya: రామయ్య భక్తులకు అలెర్ట్.. బాల రామయ్యకు రోజూ గంట పాటు విశ్రాంతి.. ఈ సమయంలో ఆలయం మూసివేత..
Ayodhya Ram Mandir
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2024 | 5:13 PM

కొన్ని వందల ఏళ్ల కల తీరిన వేళ హిందువులు, రామ భక్తులు ఉత్తర  ప్రదేశ్ లోని అయోధ్యకు బారులు తీరుతున్నారు. బాల రామయ్యను దర్శించుకోవడానికి సెలబ్రెటీలు, సామాన్యులు క్యూలు కడుతున్నారు. దీంతో గర్భగుడిలో కొలువుదీరిన బాల రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండంతో ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. దీంతో ఆలయ ట్రస్ట్ భక్తుల సౌకర్యార్థం ఆలయ దర్శన వేళలు పెంచింది. అయితే ఇప్పుడు ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయాన్ని ఇక నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట పాటు మూసివేస్తామని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్‌ తెలిపారు. శుక్రవారం నుంచే దర్శనాన్ని ఒక గంట పాటు నిలివేశారు. ఇక నుంచి రోజూ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు. వాస్తవంగా సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెంచింది.

జనవరి 23వ తేదీ నుంచి తెల్లవారు జామున 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భక్తులను ‘దర్శనానికి’ అనుమతించడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.. ఇది రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది. అంటే ఉదయం 6.00 నుంచి రాత్రి 10.00 గం. వరకు రామ్ లల్లా దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక నుంచి ఒక గంట పాటు రామయ్య దర్శనం కోసం విరామం ఇవ్వనున్నారు.

“బాల రామయ్య ఐదేళ్ల పిల్లాడు. ఎక్కువ సమయం మెలకువగా ఉండటం వల్ల ఒత్తిడిని భరించలేడు. అందువల్ల బాల రామయ్యకు కొంత విశ్రాంతి ఇవ్వడానికి, ఆలయం తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు రామయ్య విశ్రాంతి తీసుకోనున్నాడు ”అని ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..