AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా లక్షదీపోత్సవం, దశ హారతులు.. భారీ సంఖ్యలో భక్తులు హాజరు

కార్తికమాస మొదటి సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను..

Srisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా లక్షదీపోత్సవం, దశ హారతులు.. భారీ సంఖ్యలో భక్తులు హాజరు
Laksha Deepotsavam In Srisailam
Surya Kala
|

Updated on: Nov 01, 2022 | 8:29 AM

Share

కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని  భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో ప్రతి రోజూ విశిష్టమైనది.. అయితే సోమవారం మరింత విశేషమైన రోజుని పురాణగ్రంథాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక మొదటి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్య క్షేత్రాల సహా ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, దశ హారతులిచ్చారు కార్తికమాస మొదటి సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది ఈ లక్షదీపోత్సవంలో భక్తులు,ఆలయ సిబ్బంది కార్తీక దీపాలను వెలిగించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,అధికారులు,,భక్తులు పాల్గొని లక్షదీపోత్సవం,పుష్కరిణి హారతి వీక్షించి పునితులైనారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి