AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jain Temple: దొంగకు చుక్కలు చూపించిన దేవుడు.. క్షమించు బాబోయ్ అంటూ విలువైన సొమ్మును తిరిగిచ్చేసిన వైనం..

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని ఒక ఆలయంలో దొంగిలించబడిన వెండి, ఇత్తడి వస్తువులను ఒక దొంగ దొంగిలించాడు. అయితే తాను చేసిన పని తనకు బాధ కలిగించిందని క్షమాపణ లేఖతో పాటు తిరిగి ఇచ్చాడని పోలీసులు తెలిపారు.

Jain Temple: దొంగకు చుక్కలు చూపించిన దేవుడు.. క్షమించు బాబోయ్ అంటూ విలువైన సొమ్మును తిరిగిచ్చేసిన వైనం..
Jain Temple In Madhya Prade
Surya Kala
|

Updated on: Oct 30, 2022 | 6:44 PM

Share

మనం చేసిన కర్మలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయని.. మనిషి తప్పు చేస్తే.. ఎవరి నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ దేవుడి దృష్టి నుంచి తప్పించుకోలేమని.. మన మనసు మనం చేసే పనులను జడ్జ్ చేస్తోందని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకు నిదర్శనంగా నిలిచింది తాజా సంఘటన.. ఓ దేవాలయంలో విలువైన వస్తువులను దొంగిలించాడు ఓ వ్యక్తి.. అయితే మనసు ప్రతి నిమిషం తాను చేసింది తప్పు.. శిక్ష తప్పదని హెచ్చరించడంతో.. భయంతో తాను దొంగిలించిన వస్తువులను తిరిగి ఆ ఆలయంలో పెట్టేశాడు. అంతేకాదు.. తాను చేసిన పని తప్పు అని .. క్షమించమని ఓ లెటర్ కూడా రాశాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని ఒక ఆలయంలో దొంగిలించబడిన వెండి, ఇత్తడి వస్తువులను ఒక దొంగ దొంగిలించాడు. అయితే తాను చేసిన పని తనకు బాధ కలిగించిందని క్షమాపణ లేఖతో పాటు తిరిగి ఇచ్చాడని పోలీసులు ఆదివారం తెలిపారు.

అక్టోబరు 24న లమ్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినాథ్ దిగంబర్ జైన్ టెంపుల్ నుండి ‘ఛత్రాలు’ (గొడుగు ఆకారంలో ఉన్న అలంకరణ వస్తువులు), ఇత్తడి వస్తువులతో సహా అలంకరణకు ఉపయోగించే వస్తువులను గుర్తుతెలియని దొంగ దొంగిలించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శుక్రవారం ఒక జైన కుటుంబ సభ్యులు లామ్టాలోని పంచాయితీ కార్యాలయం సమీపంలోని గొయ్యిలో పడి ఉన్న బ్యాగ్‌ను గుర్తించారు. వెంటనే పోలీసులను జైన సంఘ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన వస్తువులను బ్యాగ్‌లో పెట్టిన దొంగ ఒక క్షమాపణ లేఖ కూడా అందులో పెట్టాడు. లేఖతో సహా వస్తువులున్న బ్యాగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ లెటర్ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

“నేను చేసిన పనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను తప్పు చేసాను, నన్ను క్షమించండి. దొంగతనం చేసిన తర్వాత నేను చాలా బాధపడ్డానని ఆ లెటర్ లో ఆ దొంగ రాసినట్లు పోలీసులు చెప్పారు. దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకుని..  దొంగను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే