AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indira Ekadashi 2024: పూర్వీకుల శాంతి, అనుగ్రహం కోసం ఇందిరా ఏకాదశి రోజున ఏయే వస్తువులు దానం చేయాలంటే..

పంచాంగం ప్రకారం ఇందిరా ఏకాదశి తిథి భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 2:49 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి వ్రతాన్ని సెప్టెంబర్ 28వ తేదీ శనివారం జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 7.42 నుంచి 09.12 గంటల వరకు పూజలకు అనుకూలం.

Indira Ekadashi 2024: పూర్వీకుల శాంతి, అనుగ్రహం కోసం ఇందిరా ఏకాదశి రోజున ఏయే వస్తువులు దానం చేయాలంటే..
Putrada EkadashiImage Credit source: Pinterest
Surya Kala
|

Updated on: Sep 26, 2024 | 3:43 PM

Share

పూర్వీకులకు నివాళులు అర్పించడానికి, వారికి శాంతిని అందించడానికి ఇందిరా ఏకాదశి తిథి ఒక ప్రత్యేక సందర్భం. ఏకాదశి తిథి రోజున దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. మహా విష్ణువు అనుగ్రహంతో పూర్వీకులకు ఈ రోజున దానాలు చేసిన ఫలాలు నేరుగా అందుతాయని నమ్మకం. ఈ ఏకాదశి రోజున చేసే దానం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. అంతేకాదు వ్యక్తి సంపదను పొందుతాడు. అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం పొందుతాడు.

పంచాంగం ప్రకారం ఇందిరా ఏకాదశి తిథి భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 2:49 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి వ్రతాన్ని సెప్టెంబర్ 28వ తేదీ శనివారం జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 7.42 నుంచి 09.12 గంటల వరకు పూజలకు అనుకూలం.

ఇందిరా ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేయండి

  1. నువ్వులు: నువ్వులను పూర్వీకులకు ఇష్టమైనవిగా భావిస్తారు. ఇందిరా ఏకాదశి రోజు నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకుల శాంతి, అనుగ్రహం లభిస్తుంది.
  2. నల్ల నువ్వులు: నల్ల నువ్వులను యమ ధర్మ రాజుకి చిహ్నంగా భావిస్తారు. ఇందిరా ఏకాదశి రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు యమధర్మ రాజు కోపం నుండి విముక్తి పొందుతారు.
  3. ఇవి కూడా చదవండి
  4. పిండ ప్రదానం: పూర్వీకుల ఏకాదశి తిథి రోజున పిండ ప్రదానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది.
  5. ఆవు: ఆవును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇందిరా ఏకాదశి రోజున గోవును దానం చేస్తే ఐశ్వర్యం, పూర్వీకులు కూడా మోక్షం పొందుతారు.
  6. ధాన్యం, దుప్పట్లు: పేదలకు దుప్పట్లు దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషాన్ని పొందుతారు. ఆహార ధాన్యాలు దానం చేయడం ద్వారా పూర్వీకులకు ఆహారం లభిస్తుంది.
  7. బట్టలు- పండ్లు: పేదలకు వస్త్రదానం చేయడం ద్వారా పూర్వీకులు సుఖాన్ని పొందుతారు. పండ్లు దానం చేయడం ద్వారా పూర్వీకులు స్వర్గంలో సుఖాన్ని పొందుతారు.

దానం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఇందిరా ఏకాదశి తిథిన దానం చేసేటప్పుడు మనస్సులో ఎలాంటి అత్యాశ, అహంకారం ఉండకూడదు. అంతేకాదు దానం చేసే సమయంలో పూర్వీకుల పేరుని ప్రార్థిస్తూ ఉండాలి. దానం చేసే సమయంలో ముఖంలో చిరునవ్వు, ఆనందం ఉండాలి. నవ్వుతూ దానం చేయాలి. మనసులో ఎలాంటి భేదభావాలు ఉండకూడదు. ఇలా చేసే దానాలతో ప్రజలు తమ పూర్వీకుల నుంచి ఆశీస్సులు పొంది జీవితంలో సుఖశాంతులు పొందుతారు. అంతేకాదు అన్ని రకాల దుఃఖాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి