AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై ఉన్న ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా?

Baba Harihar Nath Temple: బీహార్‌లోని సోన్‌పూర్‌లో ఉన్న బాబా హరిహరనాథ్ ఆలయం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలోని ఒకే శివలింగంలో శివుడు, శ్రీమహావిష్ణువు ఇద్దరూ కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. శ్రావణ మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని జలాభిషేకం చేసి శివ-కేశవుల ఆశీస్సులు పొందుతారు.

ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై ఉన్న ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా?
Harihar Nath Temple Sonepur
Rajashekher G
|

Updated on: Jul 25, 2026 | 11:28 AM

Share

Harihar Nath Temple Sonepur: భారతదేశంలో అనేక ఆలయాలున్నాయి. ఆ ఆలయాలు వేటికవే ప్రత్యేక సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. అలాగే, బీహార్‌లోని సోన్‌పూర్ పట్టణంలో గంగా–గండక్ నదుల సంగమ ప్రాంతంలో వెలసిన బాబా హరిహరనాథ్ ఆలయం.. దేశంలోనే అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. గర్భగుడిలోని ఒకే శివలింగంలో శివుడు, శ్రీమహావిష్ణువు ఇద్దరూ కొలువై ఉండడం. శివ –కేశవుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఆలయ పూజారుల కథనం ప్రకారం, ఒకే శివలింగంలో శివుడు, విష్ణుమూర్తి దర్శనమిచ్చే ఆలయం దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ మరొకటి లేదు. శివుడు, విష్ణువు వేర్వేరు ఆలయాల్లో దర్శనమివ్వడం సాధారణమే అయినప్పటికీ, ఒకే లింగరూపంలో ఇద్దరూ కొలువై ఉండడం ఈ క్షేత్రానికే ప్రత్యేకతగా భావిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని శివ–విష్ణు ఐక్యానికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తుంటారు.

భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం

ఈ ఆలయంలో శివుడిని, శ్రీహరిని కలిసి పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి జలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గర్భగుడిలో ఒకేసారి శివుడు, విష్ణుమూర్తిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

శ్రావణంలో ప్రత్యేక ఏర్పాట్లు

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తారు. పురుషులు, మహిళల కోసం వేర్వేరు క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జలాభిషేకం చేసేలా చర్యలు తీసుకుంటారు. భద్రత కోసం మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో మహిళా, పురుష పోలీసు బలగాలు, వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి. ఆలయ ప్రాంగణాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రతి సాయంత్రం బాబా హరిహరనాథ్‌కు నిర్వహించే భారీ హారతి, ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

గంగాజలంతో జలాభిషేకం చేసే సంప్రదాయం

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ప్రసిద్ధి చెందిన ‘బాబా గరీబ్‌నాథ్ ఆలయం’ దర్శనానికి వెళ్లే కన్వరియాలు, ‘బోల్ బామ్’ భక్తులు ముందుగా గంగా నది నుంచి పవిత్ర గంగాజలాన్ని తీసుకువచ్చి బాబా హరిహరనాథ్ ఆలయంలో జలాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఆ గంగాజలంతో గరీబ్‌నాథ్ ఆలయంలో కూడా అభిషేకం చేయడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం.

కార్తీక పౌర్ణమి, సోన్‌పూర్ జాతరలో భక్తుల వెల్లువ

శ్రావణ మాసంతో పాటు కార్తీక పౌర్ణమి రోజున కూడా ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. గంగా, గండక్ నదుల సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, అనంతరం బాబా హరిహరనాథ్ స్వామివారికి జలాభిషేకం చేస్తారు. ఇదే సమయంలో జరిగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన సోన్‌పూర్ జాతర (హరిహర క్షేత్ర మేళా) సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పాట్నా, ఛప్రా, వైశాలి, సివాన్, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, దానాపూర్ తదితర బీహార్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకుని శివ–కేశవుల ఆశీస్సులు పొందుతారు. శివుడు, విష్ణుమూర్తి ఒకే స్వరూపంలో దర్శనమిచ్చే ఈ అపూర్వ ఆలయం భక్తి, ఆధ్యాత్మికతకు చిరస్థాయి చిహ్నంగా నిలుస్తోంది.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు ఆలయ సంప్రదాయాలు, స్థానిక విశ్వాసాలు, పురాణ కథనాలు, అందుబాటులో ఉన్న ప్రజా సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. వీటిని విశ్వాసానికి సంబంధించిన అంశాలుగా మాత్రమే పరిగణించాలి.)

Follow Us
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..
చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన
చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన
అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి..
అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే సీన్ రివర్స్
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే సీన్ రివర్స్
మటన్ కర్రీలో ముక్క మెత్తగా, గ్రేవీ రుచిగా రావాలంటే..
మటన్ కర్రీలో ముక్క మెత్తగా, గ్రేవీ రుచిగా రావాలంటే..