AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala – Boyapati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. స్వామివారి సన్నిధిలో అఖండ రిలీజ్ పై క్లారిటీ

Tirumala - Boyapati: అఖండ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్.  బుధవారం ఉదయం కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి వెంకన్ననిపలువురు ప్రముఖులు..

Tirumala - Boyapati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. స్వామివారి సన్నిధిలో అఖండ రిలీజ్ పై క్లారిటీ
Boyapati
Surya Kala
|

Updated on: Jun 30, 2021 | 12:42 PM

Share

Tirumala – Boyapati: అఖండ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్.  బుధవారం ఉదయం కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి వెంకన్ననిపలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బోయపాటిని అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భముగా బోయపాటి మాట్లాడుతూ.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా చివరి సన్నివేశాల మినహా పూర్తి అయ్యిందని తెలిపారు. క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ హైదరాబాద్ లో చేయడానికి వర్షాలు ఇబ్బందిగా మారని.. అందుకనే సరైన లొకేషన్ కోసం వెదుకుతున్నామని చెప్పారు.ముఖ్యంగా కడపలో లొకేషన్స్ వెతుకుతున్నామని తెలిపారు. కరోనా . కరోనా పరిస్థితులకు అదుపులోకి వచ్చిన తర్వాతనే బాలకృష్ణ అఖండ సినిమా విడుదల చేస్తామని తెలిపారు బోయపాటి.

Also Read: బాలీవుడ్ లో వరస అవకాశాలను అందుకుంటున్న రకుల్.. అక్షయ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్