AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరనాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభం.. ఈ గుహ ఎలా వెలుగులోకి వచ్చిందంటే..

ఈ గుహ 1850లో కనుగొనబడింది. మాలిక్ కుటుంబం మొదట్లో అమరనాథ్ యాత్ర ప్రయాణాన్ని చూసుకుంది. అయితే ఇప్పుడు అలా కాదు ఎందుకంటే 2000 సంవత్సరంలో అమరనాథ్ యాత్ర బిల్లు జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం మాలిక్ కుటుంబాన్ని అమరనాథ్ యాత్ర నిర్వహణ నుంచి బయటకు పంపారు. అంతకుముందు ఆ కుటుంబానికి మూడింట ఒక వంతు వాటా వచ్చేది. ఈ పుణ్యక్షేత్రం బోర్డు ఏర్పడిన తర్వాత మాలిక్ కుటుంబానికి మూడింట ఒక వంతు వాటా ఇవ్వడం అనే నిబంధన తొలిగించారు. 

అమరనాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభం.. ఈ గుహ ఎలా వెలుగులోకి వచ్చిందంటే..
Amarnath Yatra 2024
Surya Kala
|

Updated on: Apr 15, 2024 | 5:38 PM

Share

Amarnath Yatra 2024: హిందువులు చేసే ప్రధాన తీర్థయాత్రల్లో అమర్‌నాథ్ యాత్ర ఒకటి. అమర్‌నాథ్‌లో మంచు శివలింగాన్ని పూజిస్తారు. ఇక్కడి శివలింగాన్ని దర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్తుంటారు. అమర్‌నాథ్ గుహలో మంచుతో ఉన్న పవిత్ర శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు జూన్, ఆగస్టు మధ్య కాశ్మీర్ నుంచి హిమాలయాలకు వెళతారు. మంచుతో ఉండే శివయ్యను దర్శించుకుని పూజిస్తే శివుడు అతని కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం. ఈ ప్రదేశంలోనే పరమశివుడు తన భార్య పార్వతీదేవికి అమరత్వ మంత్రాన్ని పఠించగా ఆమె చాలా సంవత్సరాలు ఇక్కడే ఉండి ఇక్కడ తపస్సు చేసిందని విశ్వాసం. ఈ గుహను ఒక ముస్లిం కనుగొన్నాడని చెబుతారు. ఈ రోజు ఆ కథ గురించి తెలుసుకుందాం..

ఎవరు కనుగొన్నారో తెలుసా?

అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం అమర్‌నాథ్ గుహను బూటా మాలిక్ అనే ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడు. జంతువులను మేపుతున్నప్పుడు బూటా మాలిక్ ఒక సన్యాసిని కలిశాడు. అప్పుడు  ఋషి అతనికి బొగ్గుతో ఉన్న సంచి ఇచ్చాడు. ఇంటికి చేరుకున్న బూటా బ్యాగును తెరిచి చూడగా బంగారు నాణేల రూపంలో ఉన్న బొగ్గు కనిపించింది. ఆ తర్వాత బూటా ఆ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పేందుకు ఆ గుహకు చేరుకున్నాడు. అయితే ఆ గుహలో ఆ సన్యాసి కనిపించలేదు. బూటా మాలిక్ ఆ గుహ లోపలికి వెళ్లినప్పుడు మంచుతో చేసిన తెల్లని శివలింగం మెరుస్తూ ఉండడం చూశాడు. అప్పటి నుంచి అమరనాథ్ యాత్ర మొదలైంది.

నివేదికల ప్రకారం ఈ గుహ 1850లో కనుగొనబడింది. మాలిక్ కుటుంబం మొదట్లో అమరనాథ్ యాత్ర ప్రయాణాన్ని చూసుకుంది. అయితే ఇప్పుడు అలా కాదు ఎందుకంటే 2000 సంవత్సరంలో అమరనాథ్ యాత్ర బిల్లు జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం మాలిక్ కుటుంబాన్ని అమరనాథ్ యాత్ర నిర్వహణ నుంచి బయటకు పంపారు. అంతకుముందు ఆ కుటుంబానికి మూడింట ఒక వంతు వాటా వచ్చేది. ఈ పుణ్యక్షేత్రం బోర్డు ఏర్పడిన తర్వాత మాలిక్ కుటుంబానికి మూడింట ఒక వంతు వాటా ఇవ్వడం అనే నిబంధన తొలిగించారు.

ఇవి కూడా చదవండి

వెబ్‌సైట్‌లోని ఒక కథనం ప్రకారం కాశ్మీర్ లోయ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కశ్యప్ ముని అక్కడ నదులను సృష్టించాడు. నీరు తగ్గిన తర్వాత లోయ ఏర్పడింది. ఆ తర్వాత భృగు ముని అక్కడ గుహను కనుగొన్నాడు. పురాణ గ్రంథాల్లో ఈ గుహ గురించి కూడా వ్రాయబడింది. దీనిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. మళ్ళీ 150 సంవత్సరాల తర్వాత దీనిని బూటా మాలిక్ కనుగొన్నారు.

అమర్‌నాథ్ యాత్రకు రెండు మార్గాలు

అమర్‌నాథ్ ఈ వార్షిక తీర్థయాత్ర చేయడానికి రెండు మార్గాలున్నాయి. అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న 48 కిలో మీటర్ల సాంప్రదాయ మార్గం.. దీనిని నున్వాన్-పహల్గామ్ మార్గం అని కూడా పిలుస్తారు. మరో మార్గం 14 కిలోమీటర్ల పొడవు గల గండేర్బల్ జిల్లాలో ఉంది. ఈ మార్గం చిన్నది. ఇరుకైనది, దీనిని బాల్టాల్ మార్గ్ అంటారు. ఈ మార్గాన్ని అధిరోహణ కష్టం అయినప్పటికీ.. ప్రతి సంవత్సరం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు ఆధ్వర్యంలో అమర్‌నాథ్ యాత్ర నిర్వహిస్తారు.

అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్

ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈరోజు (ఏప్రిల్ 15వ తేదీ) ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునే ఏ భక్తుడైనా అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు వెబ్‌సైట్ jksasb.nic.in ని సందర్శించి  నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు వెబ్‌సైట్ ప్రకారం, అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభమవుతుంది. ఎవరైనా అమరనాథ్ యాత్ర చేయాలనుకుంటే మీ పేరు ఈ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా సరే అమర్‌నాథ్‌ యాత్రను చేయలేరు.. శివయ్యను సందర్శించలేరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..