- Telugu News Photo Gallery Spiritual photos Rama Navami: Government negligence on parnasala development in Bhadrachalam Temple
Bhadrachalam: శ్రీరామ నవమి ఉత్సవాలు వేళ.. పర్ణశాల ఆలయం ఏర్పాట్లలో అధికారులు నిలువెత్తు నిర్లక్ష్యం
రామాయణ చరిత్ర ఘట్టాల్లో ప్రధానమైన పుణ్యక్షేత్రం పర్ణశాల. శ్రీ సీతారామచంద్రస్వామి సమేత లక్ష్మణులు ఈ ప్రాంతంలో 14 ఏళ్ల జీవితంలో ఎక్కువ రోజులు దండకారణ్యమైన పర్ణశాలలో ఉన్నారు. శ్రీరాముడు పర్ణశాల ప్రాంతంలో కర దూషనాధులతో భీకరమైన యుద్ధం చోటుచేసుకుంది. రామాయణ చరిత్ర ఘట్టాలను భక్తులకు అర్థమయ్యేలా బాపు విగ్రహాలను అప్పటి అధికారాలు ఏర్పాటు చేశారు.
Updated on: Apr 15, 2024 | 3:19 PM

భద్రాచల రామాలయం అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయంలో శ్రీరామ నవమి ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పర్ణశాలలో రామాయణ ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపే బాపు విగ్రహాలను విరిగిపోయాయి. వెదురుతో నిర్మించిన కుటీరం పెచ్చులు లేచిపోయాయి. రామాలయ ప్రాంగణానికి రంగులు వేయకుండా లైటింగ్ దండలు వేయడంతో భక్తులు ముక్కున వేలేసుకుని అయ్యోరామా ఏమిటి ఖర్మ అని అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రామాయణ చరిత్ర ఘట్టాల్లో ప్రధానమైన పుణ్యక్షేత్రం పర్ణశాల. శ్రీ సీతారామచంద్రస్వామి సమేత లక్ష్మణులు ఈ ప్రాంతంలో 14 ఏళ్ల జీవితంలో ఎక్కువ రోజులు దండకారణ్యమైన పర్ణశాలలో ఉన్నారు.

శ్రీరాముడు పర్ణశాల ప్రాంతంలో కర దూషనాధులతో భీకరమైన యుద్ధం చోటుచేసుకుంది.

రామాయణ చరిత్ర ఘట్టాలను భక్తులకు అర్థమయ్యేలా బాపు విగ్రహాలను అప్పటి అధికారాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ విగ్రహాలు విరిగిపోయిన సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని భక్తులు మండిపడుతున్నారు.

ఆ విగ్రహాలతో పాటు పర్ణశాల రామాలయానికి వెళ్లే స్వాగత ద్వారానికి కూడా మరమ్మతులు చేయాలని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరో రెండు రోజుల్లో శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం కార్యక్రమాలు జరపనున్నాయి. భక్తులు లక్షల సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.




