AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిధుల కోసం ఉమ్మడిపోరు.. సీఎంల కొత్త వ్యూహం

రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చెరోదారిలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణలో అధికారపార్టీ టిఆర్ఎస్ నేతలు ఓ అడుగు ముందుకేసి పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేసి ప్రధాని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు, ఎంపీలు ఇప్పటి దాకా కేవలం అభ్యర్థనలకే పరిమితమయ్యారు. కానీ తాజాగా ఇద్దరు సీఎంలు ఉమ్మడి పోరుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి మొత్తం 30 వేల కోట్ల […]

నిధుల కోసం ఉమ్మడిపోరు.. సీఎంల కొత్త వ్యూహం
Rajesh Sharma
| Edited By: |

Updated on: Dec 12, 2019 | 3:34 PM

Share

రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చెరోదారిలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణలో అధికారపార్టీ టిఆర్ఎస్ నేతలు ఓ అడుగు ముందుకేసి పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేసి ప్రధాని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు, ఎంపీలు ఇప్పటి దాకా కేవలం అభ్యర్థనలకే పరిమితమయ్యారు. కానీ తాజాగా ఇద్దరు సీఎంలు ఉమ్మడి పోరుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి మొత్తం 30 వేల కోట్ల రూపాయలు రావాల్సి వుందని కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. 29 వేల 891 కోట్లు పెండింగ్‌లో వున్నాయంటూ టిఆర్ఎస్ నేతలు పార్లమెంటు భవనం ముందు ధర్నా చేశారు. జీఎస్టీ వాటా నిధులను విడుదల చేయడంలో జాప్యమెందుకని వారు ప్రశ్నించారు. మరోవైపు పోలవరంప్రాజెక్టు నిర్మాణం, సహాయ పునరావాస పథకాల అమలు కోసం 16 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను కోరుతోంది. దాంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆర్థికలోటును ఇంత వరకు భర్తీ చేయకపోవడంపైనా కేంద్రంతో వైసీపీ ఎంపీలు చర్చలు జరుపుతున్నారు. పార్లమెంటులో ప్రస్తావించడం, మంత్రుల చుట్టూ తిరగడమే వైసీపీ ఎంపీలు పనిగా పెట్టుకున్నారు.

అయితే డిసెంబర్ తొలివారంలో ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ వేర్వేరుగా ఢిల్లీకి వెళ్ళారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు యత్నించారు. కానీ కారణాలేమైనా మోదీతో వారిద్దరి భేటీ క్యాన్సిల్ అయ్యింది. దాంతో ఇద్దరు సీఎంలు ప్రధాన మంత్రిని కల్వకుండానే తిరుగు ప్రయాణంమయ్యారు. తాజాగా.. టిఆర్ఎస్ పార్టీ పోరాట పంథాను ఎంచుకుంది. పార్లమెంటు ఎదుట ధర్నా నిర్వహించింది. జాతీయ మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ ఎంపీలు. ఈ నేపథ్యంలో బిజెపిలో కాస్త కదలిక వచ్చిన దరిమిలా వైసీపీ కూడా అదే పంథాను ఎంచుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఈనేపథ్యంలోనే కేసీఆర్, జగన్‌లిద్దరు మరోసారి భేటీ అవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే వీరిద్దరి భేటీ వుంటుందని, కేంద్రంపై పోరాడే వ్యూహంపై సీఎంలిద్దరు చర్చిస్తారని రెండు పార్టీల నేతల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ, టిఆర్ఎస్ కలిసి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే పని అవుతుందన్న అభిప్రాయంలో ఇరు పార్టీల నేతలున్నట్లు సమాచారం.

Follow Us
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు