నిధుల కోసం ఉమ్మడిపోరు.. సీఎంల కొత్త వ్యూహం

రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చెరోదారిలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణలో అధికారపార్టీ టిఆర్ఎస్ నేతలు ఓ అడుగు ముందుకేసి పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేసి ప్రధాని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు, ఎంపీలు ఇప్పటి దాకా కేవలం అభ్యర్థనలకే పరిమితమయ్యారు. కానీ తాజాగా ఇద్దరు సీఎంలు ఉమ్మడి పోరుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి మొత్తం 30 వేల కోట్ల […]

నిధుల కోసం ఉమ్మడిపోరు.. సీఎంల కొత్త వ్యూహం
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 3:34 PM

రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చెరోదారిలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణలో అధికారపార్టీ టిఆర్ఎస్ నేతలు ఓ అడుగు ముందుకేసి పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేసి ప్రధాని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు, ఎంపీలు ఇప్పటి దాకా కేవలం అభ్యర్థనలకే పరిమితమయ్యారు. కానీ తాజాగా ఇద్దరు సీఎంలు ఉమ్మడి పోరుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి మొత్తం 30 వేల కోట్ల రూపాయలు రావాల్సి వుందని కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. 29 వేల 891 కోట్లు పెండింగ్‌లో వున్నాయంటూ టిఆర్ఎస్ నేతలు పార్లమెంటు భవనం ముందు ధర్నా చేశారు. జీఎస్టీ వాటా నిధులను విడుదల చేయడంలో జాప్యమెందుకని వారు ప్రశ్నించారు. మరోవైపు పోలవరంప్రాజెక్టు నిర్మాణం, సహాయ పునరావాస పథకాల అమలు కోసం 16 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను కోరుతోంది. దాంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆర్థికలోటును ఇంత వరకు భర్తీ చేయకపోవడంపైనా కేంద్రంతో వైసీపీ ఎంపీలు చర్చలు జరుపుతున్నారు. పార్లమెంటులో ప్రస్తావించడం, మంత్రుల చుట్టూ తిరగడమే వైసీపీ ఎంపీలు పనిగా పెట్టుకున్నారు.

అయితే డిసెంబర్ తొలివారంలో ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ వేర్వేరుగా ఢిల్లీకి వెళ్ళారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు యత్నించారు. కానీ కారణాలేమైనా మోదీతో వారిద్దరి భేటీ క్యాన్సిల్ అయ్యింది. దాంతో ఇద్దరు సీఎంలు ప్రధాన మంత్రిని కల్వకుండానే తిరుగు ప్రయాణంమయ్యారు. తాజాగా.. టిఆర్ఎస్ పార్టీ పోరాట పంథాను ఎంచుకుంది. పార్లమెంటు ఎదుట ధర్నా నిర్వహించింది. జాతీయ మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ ఎంపీలు. ఈ నేపథ్యంలో బిజెపిలో కాస్త కదలిక వచ్చిన దరిమిలా వైసీపీ కూడా అదే పంథాను ఎంచుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఈనేపథ్యంలోనే కేసీఆర్, జగన్‌లిద్దరు మరోసారి భేటీ అవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే వీరిద్దరి భేటీ వుంటుందని, కేంద్రంపై పోరాడే వ్యూహంపై సీఎంలిద్దరు చర్చిస్తారని రెండు పార్టీల నేతల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ, టిఆర్ఎస్ కలిసి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే పని అవుతుందన్న అభిప్రాయంలో ఇరు పార్టీల నేతలున్నట్లు సమాచారం.

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!