టిఆర్ఎస్-బిజెపిల మధ్య నిధుల చిచ్చు

తెలంగాణలో రెండు ప్రధాన పార్టీల మధ్య నిధుల చిచ్చు రగులుకొంది. కేంద్రం నుంచి దాదాపు 30 వేల కోట్లు నిధులు తెలంగాణకు రావాల్సి వుందని తెలంగాణ రాష్ట్ర సమితి అంటుంటే టిఆర్ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపీలు ఎదురు దాడి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ సహా పలు రకాల కేంద్ర నిధులు పెండింగ్‌లో వున్నాయని ఆరోపిస్తూ బుధవారం పార్లమెంటు భవనం ఎదుట టిఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేశారు. మొత్తం 29 వేల […]

టిఆర్ఎస్-బిజెపిల మధ్య నిధుల చిచ్చు
Follow us

|

Updated on: Dec 12, 2019 | 2:19 PM

తెలంగాణలో రెండు ప్రధాన పార్టీల మధ్య నిధుల చిచ్చు రగులుకొంది. కేంద్రం నుంచి దాదాపు 30 వేల కోట్లు నిధులు తెలంగాణకు రావాల్సి వుందని తెలంగాణ రాష్ట్ర సమితి అంటుంటే టిఆర్ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపీలు ఎదురు దాడి చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ సహా పలు రకాల కేంద్ర నిధులు పెండింగ్‌లో వున్నాయని ఆరోపిస్తూ బుధవారం పార్లమెంటు భవనం ఎదుట టిఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేశారు. మొత్తం 29 వేల 891 కోట్ల రూపాయలు వివిధ పద్దుల కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సి వుందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిధుల విడుదలలో జాప్యం చేస్తుందని టిఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. పది రోజుల క్రితం ఇదే అంశంపై ప్రధాని మోదీని కల్వడానికి ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ సీఎం కెసీఆర్, ఆ తర్వాత అత్యవసర పనితో మోదీని కల్వకుండానే తిరిగి వచ్చేశారు.

ఆ తర్వాత తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో పోరాడాల్సిందిగా టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో కెసీఆర్, కెటీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే బుధవారం టిఆర్‌పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంటు భవనం ఎదుట బుధవారం ధర్నా చేశారు.

టిఆర్ఎస్ ఎంపీల ధర్నాపై బిజెపి ఎంపీలు స్సందించారు. గులాబీ ఎంపీలు పార్లమెంటు ఎదుట డ్రామాలు చేశారంటూ బిజెపి ఎంపీలు ముగ్గురు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గత ఆరేళ్ళుగా కేంద్ర మిచ్చిన నిధులను కెసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని వారు ఆరోపించారు. బడ్జెట్ నిర్వహణలో భారీ అవకతవకలు, పెద్ద ఎత్తున అవినీతి, ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం లేకపోవడం వంటి విధానాలతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కెసీఆర్ గందరగోళంలోకి నెట్టారని బిజెపి ఎంపీలు అంటున్నారు.

మొత్తమ్మీద కేంద్రం నిధులు టిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల సంబంధాలు మరింత బలహీనపడ్డాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.