AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోక్‌సభ ఎన్నికలు: నేడే నోటిఫికేషన్, నామినేషన్లు షురూ..

హైదరాబాద్: లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి దశ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదలౌతుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27, 28 రెండు రోజుల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి మే 23న ఫలితాలు విడుదల చేస్తారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ […]

లోక్‌సభ ఎన్నికలు: నేడే నోటిఫికేషన్, నామినేషన్లు షురూ..
Vijay K
|

Updated on: Mar 18, 2019 | 9:03 AM

Share

హైదరాబాద్: లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి దశ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదలౌతుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27, 28 రెండు రోజుల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి మే 23న ఫలితాలు విడుదల చేస్తారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. 1,85, 560 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననుండగా, 94, 991 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. 41,356 వీవీపాట్ యంత్రాలను సిద్ధం చేశారు.