బెజవాడ దుర్గమ్మ సేవకులకు హడల్, ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న గుబులు, అవినీతి అధికార్ల బేజారు

అమ్మవారి ఆలయంలో మొదటిసారి పాపభీతి కనిపిస్తోంది. దుర్గమ్మ ఆగ్రహిస్తుందని కాదు...ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న భయం...

బెజవాడ దుర్గమ్మ సేవకులకు హడల్, ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న గుబులు, అవినీతి అధికార్ల బేజారు
Follow us

|

Updated on: Feb 24, 2021 | 6:05 PM

అమ్మవారి ఆలయంలో మొదటిసారి పాపభీతి కనిపిస్తోంది. దుర్గమ్మ ఆగ్రహిస్తుందని కాదు…ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న భయం. ఇప్పటికే 15 మంది సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడటంతో…తమదాకా వస్తుందేమోనని మరికొందరు హడలిపోతున్నారు. మూడు వెండిసింహాల మాయం తదితర అంశాల్లో ఈవో వైఫల్యంపై ఏసీబీ నివేదిక ఇచ్చింది. 16 అంశాల్లో ఈవో పాత్రపై దేవాదాయశాఖ నివేదిక సమర్పించింది. ఏడు విభాగాల్లో అక్రమాలపై ఈవో, ఏఈవోలపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అంతేకాదు, దుర్గగుడిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకుంది. జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలనా కార్యాలయంలో 15 మంది అధికారుల బృందం ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఇంద్రకీలాద్రి అక్రమాల్లో ఈవో పాత్రపైనా ఆరోపణలు ఈవో సురేష్‌బాబు పాత్రపై విచారణ జరపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కట్ చేస్తే, ఏమో..తెలీదు..చెప్పలేను…ఇలాగే ఉంది దుర్గగుడి ఈవో సురేష్‌ రియాక్షన్‌. ఏసీబీ ఎంక్వైరీపై టీవీ9 ప్రశ్నిస్తే…చైర్మన్‌తో మాట్లాడుకోండంటూ దాటవేశారు ఈవో. దుర్గగుడి అక్రమాలన్నింటికీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసే బాధ్యుడన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. చీరల నుంచి కానుకల లెక్కింపులో అక్రమాలదాకా అన్నిట్లో మంత్రి పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. మంత్రి తప్పులకు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నారన్నారు బుద్ధా వెంకన్న. అటు, వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ఆరోపణల్ని మంత్రి పేర్ని నాని ఖండించారు. అవినీతిని ఉపేక్షించని ప్రభుత్వం కాబట్టే..స్వచ్ఛందంగా ఎంక్వయిరీ చేయిస్తోందన్నారు. దేవాదాయశాఖ మంత్రిపై కొందరు నిందలు మోపడం దారుణమన్నారు పేర్నినాని.

అటు ఏసీబీ విచారణను స్వాగతించారు దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు. ఏసీబీ నివేదికపై పాలకమండలి సభ్యులతో కమిటీ వేస్తామన్నారు. కమిషనర్‌ చెప్పిన కొన్ని విషయాలతో తాము ఏకీభవించమన్నారు సోమినాయుడు. మ్యాక్స్‌ సెక్యూరిటీకి టెండర్‌ ఇవ్వాలని డిసెంబర్‌లో నిర్ణయించామని చెప్పారు. ఈవో, కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినా.. ఇప్పటిదాకా కమిషనర్‌ ఏ విషయం చెప్పలేదన్నారు చైర్మన్‌ పైలా సోమినాయుడు. ఈవోగా సురేష్‌బాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస వివాదాలు చుట్టుముట్టాయి. దేవాదాయశాఖకు, ఏసీబీకి నిత్యం ఫిర్యాదులు వెళ్లేవి. ప్రాథమికంగా సాక్ష్యాలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. దుర్గగుడిలో కొంతమంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. ప్రతి పనిలో కమిషన్లదే రాజ్యంగా మారింది. విభాగాధిపతుల నుంచి ఉన్నతాధికారి వరకు కళ్లకు గంతలు కట్టుకోవడంతో అక్రమానిదే రాజ్యమైంది. బినామీలు చెలరేగిపోయారు. కోట్లు దోచుకున్నారు.

మూడు సింహాల వ్యవహారంలోనూ ఈవో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కనిపించకుండా పోయిన వెండి సింహాలు స్టోర్‌ రూంలో ఉన్నాయని ఒకసారి, తనిఖీ చేయాలని ఇంకోసారి పొంతన లేకుండా చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం చేశారు. సంబంధిత బాధ్యులను గుర్తించడంలోనూ లేట్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివాదం చెలరేగిన దుర్గగుడి అధికారులు సైలెంట్‌గా ఉండిపోయారు. సెక్యూరిటీ టెండర్లు, దర్శన టిక్కెట్లు,‌ చీరల విక్రయాల్లోనూ భారీగా అవకతవకలను గుర్తించింది ఏసీబీ. ప్రసాదం కౌంటర్‌లో, సామగ్రి కొనుగోలులో ఇలా ప్రతి సెక్షన్‌లో అక్రమాలు ఏసీబీ ఎంక్వయిరీలో బయటపడ్డాయి. ఇంత జరిగినా ఈవోకు తెలియకుండా పోతుందా అనేది చర్చనీయాంశమైంది.

Read also :

చీటింగ్‌.. విలాసవంతంగా బతకడం, అదే టార్గెట్‌. సిటీలో కిలాడీ లేడీ ట్రాప్‌లో పడి 11 కోట్లు సమర్పించుకున్న వ్యాపారి, సూసైడ్

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు