AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీర్థయాత్రలకు వెళ్లేవారు తెలుసుకోవల్సిన విషయాలు.. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన సందేశంలోని అంతర్యాం..

చాలా మంది తీర్థయాత్రలు చేస్తుంటారు. కన్యాకుమారీ నుంచి కాశీ వరకు ప్రతి ఒక్క దేవుడిని సందర్శిస్తుంటారు. అయితే చాలా మందికి అసలు తీర్థయాత్రలకు ఎందుకు చేయాలి.

తీర్థయాత్రలకు వెళ్లేవారు తెలుసుకోవల్సిన విషయాలు.. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన సందేశంలోని అంతర్యాం..
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2021 | 11:51 AM

Share

చాలా మంది తీర్థయాత్రలు చేస్తుంటారు. కన్యాకుమారీ నుంచి కాశీ వరకు ప్రతి ఒక్క దేవుడిని సందర్శిస్తుంటారు. అయితే చాలా మందికి అసలు తీర్థయాత్రలకు ఎందుకు చేయాలి. ఎలా చేస్తే.. భగవంతుడి కృప కలుగుతుందనేది తెలియదు. తీర్థయాత్రల గురించి శ్రీకృష్ణుడు పాండవులకు సందేశమిచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకసారి పాండవులందరూ కలిసి తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని తమ శ్రేయోభిలాషి, ఆత్మబంధువైన శ్రీకృష్ణుడికి చెప్పి.. తనను కూడా తమ వెంట రమ్మని అడుగుతారు. ఈ విషయం చెప్పగానే కృష్ణుడు.. తాను పనులు ఒత్తిడి వలన రాలేకపోతున్నానని.. తనకు బదులుగా ఓ కాయను తమతోపాటు తీర్థయాత్రలన్నింటిని తిప్పండి అని చెప్పి ఓ సొరకాయను ఇస్తాడు. వాళ్ళు సంతోషంగా తమ వెంట ఆ కాయను తీసుకెళ్ళారు. గంగ సహా అన్ని పుణ్యనదుల్లో, సాగారాల్లో స్నానాలు చేసి.. పుణ్యక్షేత్రాలన్నింటిని సందర్శించారు. తమ తీర్థయాత్రలన్నింటినీ ముగించుకోని తిరిగి హస్తినాపురానికి చేరుకున్నారు. అనంతరం కృష్ణుడి పాదాలకు నమస్కరించి ఆ సొరకాయను తిరిగి ఇస్తారు. అయితే ఆ మధ్యాహ్నమే కృష్ణుడు పాండవులకు ఆతిధ్యాన్నిచ్చాడు. అందులో వారికి ఇచ్చిన సొరకాయను కూరగా చేయించి పాండవులకు వడ్డిస్తాడు. అది తినగానే పాండవులకు చేదుగా అనిపించింది. దీంతో ఇదేంటి కృష్ణా.. ఈ చేదు సొరకాయతో భోజనం పెట్టావు అని ప్రశ్నించగా.. అయ్యో అన్ని పుణ్యతీర్థాలు తిప్పారు కాదా అయితే ఈ సొరకాయ చేదుగా అయ్యిందా.. మీతో పాటే తీసుకెళ్ళారు కాదా తీపిగా అయ్యుంటుందనుకున్నాను అని అంటాడు. దీంతో శ్రీకృష్ణుడి మాటల్లోని అర్థాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు పాండవులు. మనసులో మార్పు రాకుండా ఎన్ని తీర్థాలు చేసిన ఫలితం శూన్యం అని. అందుకే దేవుడిని స్మరించేప్పుడు మనసులో స్వార్థభావం లేకుండా ఉండాలని పురణాలు చెబుతుంటాయి.

Also Read:

భీష్మ ఏకాదశి 2021: భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత.. విష్ణువుని ఏలా పూజించాలి.. ఆరోజున చేయకూడని పనులెంటీ..

ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ.. విద్యార్థులతో ముచ్చట్లు..
ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ.. విద్యార్థులతో ముచ్చట్లు..
32 సిక్సర్లు, 445 పరుగులు.. ఇంగ్లాండ్‌పై మరోసారి విధ్వంసం?
32 సిక్సర్లు, 445 పరుగులు.. ఇంగ్లాండ్‌పై మరోసారి విధ్వంసం?
ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా' ఫుడ్స్
ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా' ఫుడ్స్
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!
హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!
భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!