Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఈ ఎద్దుకు ఏం మాయ రోగం వచ్చిందో.. రోడ్డుపై మనిషి కనిపిస్తే చాలు.. ఇదిగో ఇలా

Andhra: ఈ ఎద్దుకు ఏం మాయ రోగం వచ్చిందో.. రోడ్డుపై మనిషి కనిపిస్తే చాలు.. ఇదిగో ఇలా

Ram Naramaneni

|

Updated on: Apr 02, 2025 | 4:44 PM

రాజమహేంద్రవరం దివాన్ చెరువులో ఓ ఎద్దు రంకెలు వేస్తూ వీధుల్లో వెళ్లేవారిపై దాడి చేస్తోంది. ఓ వృద్ధురాలిని, వృద్ధుడిని గట్టిగా కుమ్మేసింది. స్థానిక యువకులు అడ్డుకున్నా ఆగకుండా దాడికి పాల్పడుతోంది. ఆవులు, ఎద్దులు రోడ్లపైకి వస్తున్నా నగరపాలక సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

తూర్పుగోదావరిజిల్లా రాజానగరంలో ఎద్దు వీరంగం సృష్టిస్తోంది. రోడ్డుపై వెళ్తున్న వారిపైకి వేగంగా వచ్చి కొమ్ములతో దాడి చేస్తోంది. అది రంకెలు వేస్తూ వీధుల్లో పరుగెడుతుండటంతో స్థానికుల్లో వణుకు మొదలైంది.  సీసీ కెమెరాలో రికార్డయిన ఎద్దు దాడి తాలూకా దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఎద్దు అలా జనాలపై ఎందుకు దాడి చేస్తుందో అర్థం కావడం లేదు. ఎవరికీ ప్రాణాపాయం సంభవించకముందే ఆ ఎద్దును అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.