03 April 2025

అప్పుడు నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం ఆమె తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. 

ఇటీవలే తెలుగులో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంది. కానీ ఒకప్పుడు ఆమె నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అలాగే డెంటిస్ట్ కూడా.

ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తెలుగు హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయమైంది. 

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. కానీ హిట్ 2 మూవీతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా క్రేజ్ మారిపోయింది. 

దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. 

ఆ తర్వాత వెంటనే లక్కీ భాస్కర్, మట్కా వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.

మీనాక్షి చౌదరి 2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్. అలాగే రాష్ట్రాస్తాయి టెన్నీస్ ప్లేయర్ కూడా. 

కాలేజీ రోజుల్లో ఆమె ఎక్కువగా స్పోర్ట్స్ లో పాల్గొనేదట. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటున్న సంగతి తెలిసిందే.