Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీలో చేరిన సినీ నటి ప్రియా రామన్..

ప్రముఖ సినీనటి ప్రియారామన్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఏపీలో ఇక చక్రం తిప్పబోతున్నారు. దేశంలోని ప్రముఖ పార్టీ అయిన బీజేపీలో నటి ప్రియారామన్ చేరారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రియా రామన్ మాట్లాడుతూ.. సమాజసేవ చేసేందుకే తను రాజకీయాల్లోకి వచ్చానని.. పదవులు తనకు ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. 44 సంవత్సరాల ప్రియా రామన్ 1993లో వచ్చిన […]

బీజేపీలో చేరిన సినీ నటి ప్రియా రామన్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 24, 2019 | 5:01 PM

ప్రముఖ సినీనటి ప్రియారామన్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఏపీలో ఇక చక్రం తిప్పబోతున్నారు. దేశంలోని ప్రముఖ పార్టీ అయిన బీజేపీలో నటి ప్రియారామన్ చేరారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రియా రామన్ మాట్లాడుతూ.. సమాజసేవ చేసేందుకే తను రాజకీయాల్లోకి వచ్చానని.. పదవులు తనకు ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు.

44 సంవత్సరాల ప్రియా రామన్ 1993లో వచ్చిన ‘వల్లి’తో సినీ రంగ ప్రవేశం చేశారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడతో పాటు మాతృభాష అయిన మలయాళంలో కూడా ఆమె అనేక సినిమాలలో నటించారు. కేరళలోని పాల్గాట్‌కు చెందిన ప్రియా రామన్.. ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాలలో నటించారు. తెలుగులో ‘దేశ ద్రోహులు, లీడర్, శుభ సంకల్పం, దొరబాబు, మావూరి మహారాజు, శ్రీవారి ప్రియురాలు’ వంటి పలు విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించారు. 2018లో ‘పడిపడి లేచె మనసు’లో.. ప్రియా రామన్ నటించిన చివరి సినిమా.

కాగా.. దక్షిణాదిలోని అన్ని ప్రాంతాల వారికి పరిచయం ఉన్న నటి కావడంతో ఆమె చేరిక పార్టీకి ఎంతగానో లభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని నివాసంలో ఉంటున్న ఆమె.. ఏపీలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.