ఛలో అమెరికా.. బైబై భారత్.. యూఎస్ జనాభాలో భారతీయుల సంఖ్య ఎంతో తెల్సా.? మైండ్ బ్లాంకే..

పుణ్యభూమి నా దేశం- ధన్య భూమి నా దేశం.. ఈ మాటలు చెప్పినప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది. మేరా భారత్ మహాన్.. అని గర్వంగా అంటారు. కానీ వాస్తవాలు చూస్తే.. భారతీయుల్లో కొందరు విదేశాలకు వెళ్లిపోతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే ఆడిపాడి ఎంజాయ్ చేసినవాళ్లు..

|

Updated on: Feb 14, 2024 | 10:55 AM

పుణ్యభూమి నా దేశం- ధన్య భూమి నా దేశం.. ఈ మాటలు చెప్పినప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది. మేరా భారత్ మహాన్..  అని గర్వంగా అంటారు. కానీ వాస్తవాలు చూస్తే.. భారతీయుల్లో కొందరు విదేశాలకు వెళ్లిపోతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే ఆడిపాడి ఎంజాయ్ చేసినవాళ్లు..  డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని విదేశాలకు వలస పోతున్నారు. బతుకుదెరువు అంటూ ఇలా వెళ్తున్నవారి నెంబర్.. క్రమంగా పెరిగిపోతోంది. విదేశాల్లో ఉన్నవాళ్లు.. ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటుంటే.. మనవాళ్లు ఎందుకు విదేశాల బాట పడుతున్నారు?  యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ - USCIS రిపోర్ట్ ఏం చెప్పింది?

పుణ్యభూమి నా దేశం- ధన్య భూమి నా దేశం.. ఈ మాటలు చెప్పినప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది. మేరా భారత్ మహాన్.. అని గర్వంగా అంటారు. కానీ వాస్తవాలు చూస్తే.. భారతీయుల్లో కొందరు విదేశాలకు వెళ్లిపోతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే ఆడిపాడి ఎంజాయ్ చేసినవాళ్లు.. డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని విదేశాలకు వలస పోతున్నారు. బతుకుదెరువు అంటూ ఇలా వెళ్తున్నవారి నెంబర్.. క్రమంగా పెరిగిపోతోంది. విదేశాల్లో ఉన్నవాళ్లు.. ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటుంటే.. మనవాళ్లు ఎందుకు విదేశాల బాట పడుతున్నారు? యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ - USCIS రిపోర్ట్ ఏం చెప్పింది?

1 / 7
USCIS 2023 రిపోర్ట్ ప్రకారం.. కిందటేడాది.. అంటే ఒక్క 2023లోనే 59,100 మంది ఇండియన్స్‌కు అమెరికా పౌరసత్వం వచ్చింది. అంటే గతేడాది కొత్తగా అమెరికా పౌరసత్వాన్ని పొందిన వారి సంఖ్యలో 6.7 శాతం మంది భారతీయులు కావడం గమనార్హం. 2023లో అమెరికా సిటిజన్ షిప్ తీసుకున్నవారి సంఖ్య 8 లక్షల 70  వేలు. అందులో ఫస్ట్ ప్లేస్‌లో మెక్సికన్లు ఉంటే.. సెకండ్ ప్లేస్‌లో మనవాళ్లే ఉన్నారు. అసలు వీళ్లంతా ఎందుకు అమెరికాకు వెళుతున్నారు? కేవలం అధిక ఆదాయం ఒక్కటే కారణమా? కాదు.. దీనికి ముఖ్యంగా ఆరు కారణాలు కనిపిస్తున్నాయి. మెరుగైన జీవితమే లక్ష్యంగా వాళ్లంతా అమెరికాతోపాటు మరికొన్ని దేశాలకు వలస వెళ్తున్నట్టు తెలుస్తోంది.

USCIS 2023 రిపోర్ట్ ప్రకారం.. కిందటేడాది.. అంటే ఒక్క 2023లోనే 59,100 మంది ఇండియన్స్‌కు అమెరికా పౌరసత్వం వచ్చింది. అంటే గతేడాది కొత్తగా అమెరికా పౌరసత్వాన్ని పొందిన వారి సంఖ్యలో 6.7 శాతం మంది భారతీయులు కావడం గమనార్హం. 2023లో అమెరికా సిటిజన్ షిప్ తీసుకున్నవారి సంఖ్య 8 లక్షల 70 వేలు. అందులో ఫస్ట్ ప్లేస్‌లో మెక్సికన్లు ఉంటే.. సెకండ్ ప్లేస్‌లో మనవాళ్లే ఉన్నారు. అసలు వీళ్లంతా ఎందుకు అమెరికాకు వెళుతున్నారు? కేవలం అధిక ఆదాయం ఒక్కటే కారణమా? కాదు.. దీనికి ముఖ్యంగా ఆరు కారణాలు కనిపిస్తున్నాయి. మెరుగైన జీవితమే లక్ష్యంగా వాళ్లంతా అమెరికాతోపాటు మరికొన్ని దేశాలకు వలస వెళ్తున్నట్టు తెలుస్తోంది.

2 / 7
మన దేశంలో కిందటేడాది నిరుద్యోగం రేటు దాదాపు 8 శాతం. అంటే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు చాలామంది ఉన్నారని అర్థం. కానీ ఉద్యోగాలే సరిపడా లేవు. అందులోనూ భారీ జీతాలు, విలాసవంతమైన సౌకర్యాలూ, ఇతరత్రా ప్రయోజనాలు.. అందరికీ అందవు. ఈ విషయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి కాస్త నయం. అందుకే ఈ ఫీల్డ్‌తో పాటు వివిధ రంగాల్లో పనిచేయడానికి, అక్కడే స్థిరపడానికి విదేశాలకు వలస వెళుతున్నారు. ఇందులో ముఖ్యమైనది ఉపాధి అవకాశాలే. ఎందుకంటే.. అమెరికాతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాల్లో మనవాళ్లు ఎక్కువగానే ఉన్నారు. విస్తృతమైన ఉపాధి అవకాశాలే దీనికి కారణం.

మన దేశంలో కిందటేడాది నిరుద్యోగం రేటు దాదాపు 8 శాతం. అంటే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు చాలామంది ఉన్నారని అర్థం. కానీ ఉద్యోగాలే సరిపడా లేవు. అందులోనూ భారీ జీతాలు, విలాసవంతమైన సౌకర్యాలూ, ఇతరత్రా ప్రయోజనాలు.. అందరికీ అందవు. ఈ విషయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి కాస్త నయం. అందుకే ఈ ఫీల్డ్‌తో పాటు వివిధ రంగాల్లో పనిచేయడానికి, అక్కడే స్థిరపడానికి విదేశాలకు వలస వెళుతున్నారు. ఇందులో ముఖ్యమైనది ఉపాధి అవకాశాలే. ఎందుకంటే.. అమెరికాతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాల్లో మనవాళ్లు ఎక్కువగానే ఉన్నారు. విస్తృతమైన ఉపాధి అవకాశాలే దీనికి కారణం.

3 / 7
మన దేశంలో ఉన్నత చదువులు చదివిన తరువాత కూడా విదేశాల్లో అంతకుమించి చదవడానికి చాలామంది ఇష్టపడతారు. దీనిని కరోనాకు ముందు, కరోనాకు తరువాత అని చెప్పాలి. ఎందుకంటే.. కరోనాకు ముందు విదేశాలకు వెళ్లి చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు ఆరు లక్షలు ఉండేది. కానీ కరోనా సమయంలో ఉన్న రూల్స్ వల్ల ఆ నెంబర్ తగ్గింది. ఇప్పుడు మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ క్యాంపస్‌లలో ఉండే సౌకర్యాలు, వాతావరణం, మెరుగైన బోధనా ప్రమాణాలు వారిని అక్కడికి వెళ్లేలా చేస్తున్నాయంటున్నారు విద్యారంగ నిపుణులు.

మన దేశంలో ఉన్నత చదువులు చదివిన తరువాత కూడా విదేశాల్లో అంతకుమించి చదవడానికి చాలామంది ఇష్టపడతారు. దీనిని కరోనాకు ముందు, కరోనాకు తరువాత అని చెప్పాలి. ఎందుకంటే.. కరోనాకు ముందు విదేశాలకు వెళ్లి చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు ఆరు లక్షలు ఉండేది. కానీ కరోనా సమయంలో ఉన్న రూల్స్ వల్ల ఆ నెంబర్ తగ్గింది. ఇప్పుడు మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ క్యాంపస్‌లలో ఉండే సౌకర్యాలు, వాతావరణం, మెరుగైన బోధనా ప్రమాణాలు వారిని అక్కడికి వెళ్లేలా చేస్తున్నాయంటున్నారు విద్యారంగ నిపుణులు.

4 / 7
జీవితం ఎంత మెరుగ్గా ఉంటే.. లైఫ్‌లో అంత సంతోషం ఉంటుంది. కేవలం డబ్బొక్కటే దీనిని డిసైడ్ చేయదు. అయినా ఇలాంటివాటిని ఊహకు అందని రీతిలో కల్పిస్తుంటాయి కొన్ని దేశాలు. అందుకే బ్రిటన్, కెనడా, అమెరికా..ఇలా చాలా దేశాల్లో మనవాళ్లు మెరుగైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దానికి అలవాటు పడడంతో.. వారు మళ్లీ వెనక్కు వచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పటికే తమ కుటుంబ సభ్యులు అమెరికాలో ఉంటే.. వారితో పాటు ఉండడం కోసం.. మరికొంతమంది తరలిపోతున్నారు. బంధాలను, బంధుత్వాలను వదులుకోలేక.. అలాగని వారికి దూరంగా ఉండలేక... చాలామంది అక్కడికి వెళ్లడానికి అడుగు ముందుకేస్తున్నారు.

జీవితం ఎంత మెరుగ్గా ఉంటే.. లైఫ్‌లో అంత సంతోషం ఉంటుంది. కేవలం డబ్బొక్కటే దీనిని డిసైడ్ చేయదు. అయినా ఇలాంటివాటిని ఊహకు అందని రీతిలో కల్పిస్తుంటాయి కొన్ని దేశాలు. అందుకే బ్రిటన్, కెనడా, అమెరికా..ఇలా చాలా దేశాల్లో మనవాళ్లు మెరుగైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దానికి అలవాటు పడడంతో.. వారు మళ్లీ వెనక్కు వచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పటికే తమ కుటుంబ సభ్యులు అమెరికాలో ఉంటే.. వారితో పాటు ఉండడం కోసం.. మరికొంతమంది తరలిపోతున్నారు. బంధాలను, బంధుత్వాలను వదులుకోలేక.. అలాగని వారికి దూరంగా ఉండలేక... చాలామంది అక్కడికి వెళ్లడానికి అడుగు ముందుకేస్తున్నారు.

5 / 7
మన దేశంతో పోలిస్తే.. కొన్ని దేశాల్లో ఉద్యోగుల వేతనాలు ఎక్కువగానే ఉండొచ్చు. వ్యాపారాల ద్వారా ఎక్కువగా సంపాదించవచ్చు. అందుకే  అలాంటి దానిని కోరుకునేవారు కూడా భారత్‌కు బైబై చెబుతున్నారు. ఆర్థికంగా పటిష్టంగా ఉండే దేశాల్లో ఉండే ఆర్థిక అవకాశాల కోసం.. ఇండియా వదిలి వెళ్లిపోతున్నారు. ఇక గత పుష్కరకాలం డేటాను చూస్తే.. దాదాపు 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. వీరిలో ఎక్కువమంది అమెరికా సిటిజన్ షిప్‌కే మొగ్గుచూపారు. కేవలం 2022లోనే లక్షా 83 వేల 741 మంది మన దేశ పౌరసత్వాన్ని కాదనుకుని వెళ్లిపోయారు.

మన దేశంతో పోలిస్తే.. కొన్ని దేశాల్లో ఉద్యోగుల వేతనాలు ఎక్కువగానే ఉండొచ్చు. వ్యాపారాల ద్వారా ఎక్కువగా సంపాదించవచ్చు. అందుకే అలాంటి దానిని కోరుకునేవారు కూడా భారత్‌కు బైబై చెబుతున్నారు. ఆర్థికంగా పటిష్టంగా ఉండే దేశాల్లో ఉండే ఆర్థిక అవకాశాల కోసం.. ఇండియా వదిలి వెళ్లిపోతున్నారు. ఇక గత పుష్కరకాలం డేటాను చూస్తే.. దాదాపు 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. వీరిలో ఎక్కువమంది అమెరికా సిటిజన్ షిప్‌కే మొగ్గుచూపారు. కేవలం 2022లోనే లక్షా 83 వేల 741 మంది మన దేశ పౌరసత్వాన్ని కాదనుకుని వెళ్లిపోయారు.

6 / 7
మనం కూడా విదేశాలతో పోటీ పడుతూ.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో మనది కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. దీనికోసం ప్రభుత్వంతోపాటు అన్ని వర్గాలూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఈ కల సాకారమైన రోజున.. మన దేశంలోనూ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ భారీగా పెరుగుతాయి. అప్పుడు ఈ వలసలు ఆగిపోతాయని.. భారతదేశ వృద్ధిలో వారంతా భాగస్వాములవుతారని ఆశిద్దాం.

మనం కూడా విదేశాలతో పోటీ పడుతూ.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో మనది కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. దీనికోసం ప్రభుత్వంతోపాటు అన్ని వర్గాలూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఈ కల సాకారమైన రోజున.. మన దేశంలోనూ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ భారీగా పెరుగుతాయి. అప్పుడు ఈ వలసలు ఆగిపోతాయని.. భారతదేశ వృద్ధిలో వారంతా భాగస్వాములవుతారని ఆశిద్దాం.

7 / 7
Follow us