AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesha Statue: 3 వేల అడుగుల ఎత్తులో శిఖరం అంచున వెలసిన బొజ్జ గణపయ్య.. ప్రయాణం ఓ సాహసమే..

భారతదేశ వ్యాప్తంగా గణేష్ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మేము మీకు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గణేశుడి విగ్రహం గురించి తెలియజేనున్నాం. ఇక్కడ గణేశుడు శిఖరంపై కొలువై ఉన్నాడు. కనుక ఈ స్థానం చాలా ప్రత్యేకమైనది.

Surya Kala
| Edited By: TV9 Telugu|

Updated on: Aug 22, 2024 | 1:16 PM

Share
 భారతదేశంలోని ఓ పర్వత శిఖరంపై గణేశుడి విగ్రహం ఉంది. ఇక్కడ గణపతి కొలువై ఉందని పురాణాలలో ఓ కథ ఉంది.  పరశురాముడికి, గణపతికి బంధుత్వం ఉందని చెబుతారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మీరు విభిన్నమైన రీతిలో గణపతిని దర్శించుకోవాలనుకుంటే, మీరు ఖచ్చితంగా ఈ గణపతిని దర్శనం లిస్ట్ లో చేర్చుకోండి.

భారతదేశంలోని ఓ పర్వత శిఖరంపై గణేశుడి విగ్రహం ఉంది. ఇక్కడ గణపతి కొలువై ఉందని పురాణాలలో ఓ కథ ఉంది. పరశురాముడికి, గణపతికి బంధుత్వం ఉందని చెబుతారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మీరు విభిన్నమైన రీతిలో గణపతిని దర్శించుకోవాలనుకుంటే, మీరు ఖచ్చితంగా ఈ గణపతిని దర్శనం లిస్ట్ లో చేర్చుకోండి.

1 / 5
 ఈ గణపతి విగ్రహాన్ని ధోల్కల్ గణేష్ అని పిలుస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఉంది. బస్తర్‌లోని దంతేవాడ జిల్లాలోని ఫరస్‌పాల్ గ్రామం, బైలాడిలా కొండపై వెలిశాడు బొయ్య గణపయ్య

ఈ గణపతి విగ్రహాన్ని ధోల్కల్ గణేష్ అని పిలుస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఉంది. బస్తర్‌లోని దంతేవాడ జిల్లాలోని ఫరస్‌పాల్ గ్రామం, బైలాడిలా కొండపై వెలిశాడు బొయ్య గణపయ్య

2 / 5
 ఈ చారిత్రాత్మక గణపతి విగ్రహం సుమారు 3000 అడుగుల ఎత్తులో స్థాపించబడింది. 3 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని శిఖరం అంచున ఎలా ఏర్పాటు చేశారనేది నేటికీ రహస్యంగానే ఉంది

ఈ చారిత్రాత్మక గణపతి విగ్రహం సుమారు 3000 అడుగుల ఎత్తులో స్థాపించబడింది. 3 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని శిఖరం అంచున ఎలా ఏర్పాటు చేశారనేది నేటికీ రహస్యంగానే ఉంది

3 / 5
 ఈ విగ్రహానికి స్థలానికి చెందిన ఓ కథ పురాణాల్లో ఉంది. ఈ ప్రదేశంలో పరశురాముడు, గణేశుడు పోట్లాడుకున్నారని, ఈ ప్రదేశంలో గణేశుడి దంతం విరిగి పడిందని నమ్మకం. ఇక్కడ గణపతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు శిఖరానికి చేరుకుంటారు.

ఈ విగ్రహానికి స్థలానికి చెందిన ఓ కథ పురాణాల్లో ఉంది. ఈ ప్రదేశంలో పరశురాముడు, గణేశుడు పోట్లాడుకున్నారని, ఈ ప్రదేశంలో గణేశుడి దంతం విరిగి పడిందని నమ్మకం. ఇక్కడ గణపతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు శిఖరానికి చేరుకుంటారు.

4 / 5
 ఇక్కడ ఉన్న గణేశుడు అక్షతలు, విరిగిన దంతాలు, పూలమాలలు, మోదకాలు పట్టుకుని ఉన్నాడు. 2012 సంవత్సరంలో, ఈ విగ్రహం  చిత్రం వైరల్ అయ్యింది. నేడు ఇది ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఇది నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నప్పటికీ,  గణపతి దర్శనం చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు భక్తులు

ఇక్కడ ఉన్న గణేశుడు అక్షతలు, విరిగిన దంతాలు, పూలమాలలు, మోదకాలు పట్టుకుని ఉన్నాడు. 2012 సంవత్సరంలో, ఈ విగ్రహం చిత్రం వైరల్ అయ్యింది. నేడు ఇది ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఇది నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నప్పటికీ, గణపతి దర్శనం చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు భక్తులు

5 / 5