వివాహం అనేది.. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది.. ప్రత్యేకమైనది.. తమకు నచ్చిన వారిని చూసి పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు.. అబ్బాయిలు.. ఆలోచిస్తారు.. భవిష్యత్తును ఊహించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఇద్దరు ఆత్మలు కలుస్తాయి.. ఇద్దరి మధ్య వివాహం శాశ్వత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అయితే, ఇంతకుముందు అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ చాలా చిన్న వయస్సులోనే వివాహం చేసుకునేవారు.. దాని వల్ల ప్రతికూలతలు ఏర్పడినట్లే.. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వల్లకూడా అవాంతరాలు ఏర్పడతాయని నిపుణులుచెబుతున్నారు. భారత ప్రభుత్వం చట్టం ప్రకారం.. పెళ్లి నాటికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండటం తప్పనిసరి. అయితే, ప్రస్తుతం మారుతున్న జీవనశైలిని అనుసరించి అబ్బాయిలు, అమ్మాయిలు చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఆలస్యమైన వివాహం కొన్నిసార్లు భాగస్వామితో చాలా ఇబ్బందులను తెస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకోండి..